124 ఏళ్ల నాటి వర్షాభావం
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో జూన్లో వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో అధిక వర్షాలతో ఆ లోటు తీరిపోయింది. మళ్లీ ఆగస్టు ఆరంభం నుంచి చినుకుజాడ లేదు. రుతుపవనాల గమనాన్ని ఎల్నినో దెబ్బతీయడంతో మందగించి వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి’ అని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు.
దేశంలో 1899 ఆగస్టులో 40 శాతం లోటు వర్షపాతం
ప్రస్తుత నెలలో ఇప్పటికే 35 %..
తెలంగాణలో 66 శాతం లోటు
వానాకాలంపై ‘ఎల్నినో’ ప్రభావం
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో జూన్లో వర్షపాతం లోటు ఏర్పడింది. జులైలో అధిక వర్షాలతో ఆ లోటు తీరిపోయింది. మళ్లీ ఆగస్టు ఆరంభం నుంచి చినుకుజాడ లేదు. రుతుపవనాల గమనాన్ని ఎల్నినో దెబ్బతీయడంతో మందగించి వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి’ అని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు.
ఈనాడు, హైదరాబాద్: వానాకాలంలోనూ చినుకు జాడలేక దేశవ్యాప్తంగా 289 జిల్లాల్లో కరవు ఛాయలు అలముకున్నాయి. గత 124 ఏళ్లలో తొలిసారి ఆగస్టులో పలు రాష్ట్రాల్లో సాధారణ సగటు వర్షపాతంతో పోలిస్తే 35 శాతానికి మించి లోటు ఏర్పడింది. 1899 ఆగస్టు నెలలో జాతీయ స్థాయిలో అత్యధిక లోటు 40 శాతంగా, 1913లో 31 శాతంగా నమోదవగా, ఈ ఏడు మరోసారి అదే పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఈ నెలలో రానున్న అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే, తీవ్ర తుపాన్లు ఏర్పడే పరిస్థితి లేదని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది. వర్షాభావం ఇలాగే కొనసాగితే ఈ నెలలో లోటు 40 శాతం దాటిపోయే సూచనలున్నాయి’ అని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణలోనూ
ఈ నెల 1 నుంచి మంగళవారం(22వతేదీ) నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం (166.6 మిల్లీమీటర్ల) కన్నా 66 శాతం లోటు ఏర్పడింది. జిల్లాల వారీగా చూస్తే వికారాబాద్లో అత్యధికంగా 93, జనగామలో 90, సిద్దిపేటలో 83, రంగారెడ్డి, సంగారెడ్డిల్లో 82% చొప్పున లోటుంది. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 44 మండలాల్లో అత్యధిక, 284 మండలాల్లో అధిక, 242 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇంకా 42 మండలాల్లో లోటే ఉంది. గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నా అవి కొన్ని జిల్లాలకే పరిమితమవుతున్నాయి. నెలాఖరు వరకు భారీ వర్షాలు కురవని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాతావరణశాఖ లెక్కల ప్రకారం సాధారణ సగటు వర్షపాతం కన్నా 19% ఎక్కువ లేదా తక్కువ కురిసినా సాధారణం కిందనే పరిగణిస్తారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా గత జూన్ 1 నుంచి మంగళవారం వరకూ 289 జిల్లాల్లో 19 శాతానికి మించి లోటు ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఈ నెలలో ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణ వర్షపాతం కూడా లేదని వెల్లడించింది. ‘వానాకాలంలో రెండుసార్లు వర్షాలు కురిసే మధ్య కాలాన్ని పొడి విరామం అంటారు. ఈ విరామం సాధారణంగా వారం, పదిరోజులు ఉంటుంది. ఈ నెలలో దేశవ్యాప్తంగా వందల జిల్లాల్లో 20 రోజులకుపైగా పొడి విరామం ఏర్పడింది. సాధారణంగా జూన్లో వేసిన పైర్లు ఆగస్టులో కురిసే వర్షాలకు ఏపుగా ఎదిగి పూత, కాత దశకు వస్తాయి. ఆ వర్షాల ఆధారంగానే వానాకాలంలో పంటల దిగుబడి పెరుగుతుంది. విరామకాలం పెరగడంతో జూన్, జులై నెలల్లో వర్షాధార భూముల్లో వేసిన పైర్లు ఎండిపోతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఈ ఏడాది వానాకాలంలో ఎల్నినో ప్రభావం ఉంటుందని, ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబరులో ఇది ఎక్కువగా కనిపిస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ముందే హెచ్చరించాయి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం పరిస్థితులున్నాయి’ అని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్న చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మేడిగడ్డపై పీటముడి!
మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. -
నెలాఖరులోగా కొత్త వీసీలు
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. -
ఏఐతో ఎంచక్కా వైద్యం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
తియ్యటి జొన్న.. ఇథనాల్లో మిన్న!
తెల్ల, పచ్చ జొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
వేధించాడని జైలుశిక్ష... పెళ్లి చేసుకున్నాడని విముక్తి
ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి కింది కోర్టు రెండున్నరేళ్ల శిక్ష విధిస్తే, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని 3నెలలకు తగ్గించింది. -
సుంకం చెల్లించని మద్యం స్వాధీనంలో రికార్డు!
లోక్సభ ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్)తో పాటు ఇతర మాదకద్రవ్యాల స్వాధీనంలో తెలంగాణ ఆబ్కారీశాఖ రికార్డు సృష్టించింది. -
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి
విద్యుత్ సంస్థల్లో గతంలో ఇచ్చిన పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. -
కేయూలో తాత్కాలిక అధ్యాపకుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. -
45% ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను పీఆర్టీయూ తెలంగాణ సంఘం కోరింది. -
పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం.. అకాడమీకి జరిమానా
పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
తడిసిన ధాన్యం.. కర్షకుడి దైన్యం
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హనుమకొండ, వరంగల్లో మూడు రోజుల క్రితం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. -
15% స్థానికేతర కోటాపై సందిగ్ధత
ఏపీలో అమలు చేస్తున్న 15% స్థానికేతర(ఓపెన్) కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. -
ఎన్నికల విధుల వేతనాల్లో వ్యత్యాసాలు తొలగించాలి
లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే వేతనాల్లో వ్యత్యాసాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!
-
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్