ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) గురువారం ఎన్నికయ్యారు.
ఈనాడు, హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్గా తొలిసారిగా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) గురువారం ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన ఆమె స్థానిక స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయవాద పట్టా పొందారు. ఉస్మానియాలో ఎంఏ చేశారు. ఆమె తల్లిదండ్రులు పట్లోళ్ల శంకర్రెడ్డి, సారారెడ్డి. 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్తో ఆమెకు వివాహం కాగా భర్తతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అక్కడి ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా డిగ్రీ పొందారు. తర్వాత ఆమె ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేశారు. స్థానికంగా ఉంటూ భర్తతో కలిసి విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె చొరవతో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహం స్ట్రాత్ఫీల్డ్లోని హోమ్బుష్ కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటయింది.
ఆమె సేవలకు గుర్తింపుగా 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. 2021లో ఆమె నివాసం ఉండే స్ట్రాత్ఫీల్డ్ పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులతో పాటు ఆస్ట్రేలియా వాసులు సైతం ఆమెను పోటీ చేయాలని కోరారు. స్థానిక లేబర్, లిబరల్ పార్టీల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థినిగా పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఈ పురపాలక సంఘానికి ఏటా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు ఈ అవకాశం దక్కడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు నీల్, నిఖిల్రెడ్డిలు. వీరిలో నిఖిల్రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చదరంగం ఛాంపియన్గా నిలిచాడు. సంధ్యారెడ్డి స్ట్రాత్ఫీల్డ్ డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడంపై భారాస ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. ఆమె ఎన్నిక తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
‘చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్’
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
-
దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్