ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది.
కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన
11వ తేదీన పథకం ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో నిర్మాణ వ్యయాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ దశల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం ఆధార్ ఆధారంగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వనుంది. దీన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుడికి అందజేయనుంది. స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అంతే మొత్తాన్ని కేటాయించనుంది. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారితో ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ పేరిట ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈనెల 11వ తేదీన భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కొలిక్కి రావడంతో ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా వచ్చిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర రిజర్వు కోటా కింద 33,500 ఇళ్లు
ఏటా 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ఆ ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు కేటాయిస్తుంది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వు కోటా కింద ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిన విషయం తెలిసిందే. నిర్మాణ దశలను పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నాలుగు దశల్లో ఆర్థిక సహాయం
- బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష
- పైకప్పు(రూఫ్) స్థాయిలో రూ.లక్ష
- పైకప్పు నిర్మాణం తరవాత రూ.2 లక్షలు
- నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష
అర్హులెవరంటే..
- లబ్ధిదారుడు విధిగా దారిద్య్రరేఖ(బీపీఎల్)కు దిగువన ఉన్న వారై ఉండాలి. ఆహార భద్రత కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని గుర్తిస్తారు.
- లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి.
- గ్రామం లేదా పురపాలిక పరిధి వారై ఉండాలి.
- గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్నా అర్హులే.
- అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడు కావచ్చు.
- వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు.
- ఒంటరి(సింగిల్ ఉమెన్), వితంతు(విడోవర్) మహిళలూ లబ్ధిదారులే.
ఇల్లు మంజూరు ఇలా
- ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు మహిళలు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు.
- ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు.
- గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
- లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి, ఖరారు చేస్తారు.
- జిల్లాల్లో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి.
- లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డుసభలో ప్రదర్శిస్తారు.
- 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
‘చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్’
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!