కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనఫైడ్లు..!
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు.
ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు
వంద మందికి శిక్షణ నిలిపివేత.. వారి విద్యాభ్యాసంపై క్షేత్రస్థాయి విచారణ
ఈనాడు, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట సుమారు 350 మంది పత్రాలు నకిలీవిగా అనుమానించి పక్కనపెట్టారు. అనంతరం ప్రాథమిక విచారణలో 250 నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారు. వారు చదివిన పాఠశాలల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు.
సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్ స్కూళ్లలో..
రాష్ట్రవ్యాప్తంగా 13,444 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీఎస్ఎస్పీకి చెందిన 5,010 మందికి మినహా సివిల్, ఏఆర్ తదితర విభాగాల వారికి ఫిబ్రవరి 21 నుంచి 9 నెలల శిక్షణ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 7 వరకు నాలుగు తరగతులు ఎక్కడ చదివి ఉంటే అక్కడి స్థానికుడిగా పరిగణిస్తారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనఫైడ్లనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లు.. అందులో ఒకటి హైదరాబాద్ జిల్లా ఉన్నట్లు పరిశీలనలో వెలుగుచూసింది. సుదూర ప్రాంతాలకు చెందిన వారు నగరంలో చదివినట్లు చూపడం.. అవి కూడా కొన్ని తరగతులే కావడంతో అనుమానాలకు బలం చేకూర్చింది. జీవో 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించి నియామకాలు చేపడతారు. సాధారణంగా హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. దీంతో ఇక్కడి పాఠశాలల నుంచి నకిలీ బోనఫైడ్ తీసుకున్నట్లు స్పెషల్ బ్రాంచి అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండే ఒక పాఠశాల పదుల సంఖ్యలో అభ్యర్థులకు బోనఫైడ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు పాఠశాలలపైనా ఆరా తీస్తున్నారు.
శిక్షణకు 10 శాతం మంది దూరం!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నియమితులైన పోలీస్ కానిస్టేబుళ్లకు గత నెల చివరివారంలో శిక్షణ ప్రారంభం కాగా.. ఇప్పటికీ పలువురు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిక్షణకు ఎంపికైన వారిలో సుమారు 10 శాతం మంది ఇంకా రిపోర్ట్ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శిక్షణ కళాశాలలు (పీటీసీలు), నగర శిక్షణ కేంద్రాలు (సీటీసీలు), జిల్లా శిక్షణ కేంద్రాల (డీటీసీల)తోపాటు టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్నీ కలిపి 28 కేంద్రాల్లో గత నెల 21 నుంచి శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 13,953 మంది కానిస్టేబుళ్లకుగాను తొలిదశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా.. మొదటిరోజు సుమారు 6,500 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నెల మొదటివారం ముగిసేనాటికి ఇంకా 900 మంది వరకు శిక్షణకు హాజరు కాలేదని తెలిసింది. కంటి పరీక్షల్లో జాప్యం వల్ల ఎక్కువమంది హాజరు కాలేకపోయినట్లు తేలింది. ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడంతో పలువురు హాజరు కాలేదని చెబుతున్నారు. పెట్టీ కేసులు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచి విచారణలో తేలడం వంటి కారణాలతో మరికొందరు శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!