మావోయిస్టు నేతలపై రివార్డు

మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు.

Published : 24 Apr 2024 03:41 IST

మల్లోజుల, రాజిరెడ్డి తదితరులపై రూ.25 లక్షల చొప్పున..
పోలీసు శాఖ విస్తృత ప్రచారం

గోదావరిఖని, న్యూస్‌టుడే: మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు ఈమేరకు అప్రమత్తమయ్యారు. అజ్ఞాతంలో ఉన్న పలువురు మావోయిస్టు అగ్రనేతల తలలకు వెలలు నిర్ణయించి, సంబంధిత ప్రచార ప్రతులను వివిధ ప్రాంతాల్లో అతికిస్తున్నారు. ఆయా మావోయిస్టులు స్వయంగా లొంగిపోతే రివార్డు మొత్తం వారికే ఇస్తామని పేర్కొన్నారు.

వీరిపై రూ.25 లక్షలు: మల్లోజుల వేణుగోపాల్‌రావు, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు, బండి ప్రకాశ్‌, సలకాల సరోజన, జాడి వెంకటి, మైలారపు ఆడెల్లు, బడె చొక్కారావు
రూ.20 లక్షలు: గంకిడి సత్యనారాయణరెడ్డి, కంకణాల రాజిరెడ్డి,  రూ.8 లక్షలు: ఆలేటి రామలచ్చులు, రూ.5 లక్షలు: ఏగోలపు మల్లయ్య, అప్పాసి నారాయణ, చీమల నర్సయ్య, దాతు ఐలయ్య, డీకొండ శంకరయ్య,  రూ.4 లక్షలు: జువ్వాడి వెంకటేశ్వర్‌రావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని