ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్‌కు గాయాలు

వరంగల్‌ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్‌ఫైర్‌) పేలింది.

Published : 29 Apr 2024 03:04 IST

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని ఈవీఎం స్ట్రాంగ్‌ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్‌ఫైర్‌) పేలింది. ఈ ప్రమాదంలో అతని కాలికి గాయమైంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన ఏ.రాజేశ్‌(2012 బ్యాచ్‌)కు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎనుమాముల మార్కెట్‌ యార్డులోని 12వ నంబరు గోదాం స్ట్రాంగ్‌ రూం వద్ద విధులు కేటాయించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఫోన్‌ లిఫ్ట్‌ చేసే క్రమంలో చేతిలో ఉన్న (7.62ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్‌) గన్‌ జారి కిందపడి పేలింది. బుల్లెట్‌ అతని ఎడమకాలి మడిమ నుంచి దూసుకెళ్లింది. వెంటనే పోలీసు సిబ్బంది గమనించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని