పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి.
అడవుల్లో అడుగంటుతున్న జలవనరులు
వాగుల్లో చెలమలు తోడుతున్న అటవీ సిబ్బంది
ట్యాంకర్లు, సోలార్ బోర్ల వినియోగం..
ఈనాడు, హైదరాబాద్: మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. ఈ పరిస్థితిలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. అడవుల్లో ఏర్పాటుచేసిన సాసర్పిట్లలో ట్యాంకర్లతో, సోలార్ బోర్లతో కుంటల్లో నీళ్లు నింపడం వంటి చర్యలు చేపట్టింది. ఎండిన వాగుల్లోని ఇసుకను అటవీ సిబ్బంది తవ్వి నీటి చెలమలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగూడెం, నిర్మల్, ఆసిఫాబాద్, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మృగవని జాతీయ ఉద్యానవనం (చిలుకూరు అభయారణ్యం)లో పనిచేయని సోలార్ బోరుకు మరమ్మతులు చేయిస్తున్నారు.
మారుతున్న ఆవాసాలు?
రాష్ట్రంలో రెండు టైగర్ రిజర్వులు, 12 వైల్డ్లైఫ్ శాంక్చరీలు, 3 జాతీయ ఉద్యానవనాలున్నాయి. వన్యప్రాణుల సంచారం ప్రధానంగా వీటిలోనే ఉంది. నీటి వనరులు అడుగంటడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వు, కాగజ్నగర్ కారిడార్లో కెమెరా ట్రాపింగ్లో పులులు అంతగా కనిపించడంలేదని తెలుస్తోంది. అమ్రాబాద్ అడవుల్లో కొన్ని పులులు.. కృష్ణా నదిని దాటి ఏపీ వైపు వెళ్లాయా? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
అడవుల్లో భూమిలోకి ఇంకే నీళ్లు తక్కువే?
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2.77 కోట్ల ఎకరాలు కాగా, అందులో అటవీ ప్రాంతం 66.64 లక్షల ఎకరాలు. ఇందులో చిక్కటి అడవి 33.94 శాతమే ఉంది. కార్చిచ్చులతో మట్టి నాణ్యత తగ్గుతోంది. దీంతో అడవుల్లో వర్షపు నీరు ఇంకే సామర్థ్యం తగ్గి..భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఫలితంగా ఉపరితల జలవనరులు త్వరగా ఎండిపోతున్నాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
నీటి కొరత అధిగమించేందుకు అన్ని చర్యలు
- ఎం.సి.ఫర్గెయిన్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్)
అడవుల్లో నీటి కొరతను అధిగమించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎండిన వాగుల్లో నీటి చెలమలు తవ్వడం ఫలితాలనిస్తోంది. దగ్గరలోని గ్రామ పంచాయతీల ట్యాంకర్లనూ తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నాం. సాసర్పిట్లను మూడునాలుగు రోజులకోసారి నింపుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
19 జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాణిజ్యపన్నులు X ఆబ్కారీ
తెలంగాణలో ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖల మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. పన్ను చెల్లింపుల్లో ఆబ్కారీశాఖ ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్యపన్నుల శాఖ సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా నిలవగా... తాజాగా హాలోగ్రామ్ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. -
ఈడీ ఛార్జిషీట్పై నేడు విచారణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. -
ఓటేశారు.. తిరిగొచ్చారు..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు ఓటు వేయడానికి వెళ్లిన వారందరూ సోమవారం పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. -
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆదేశించారు. -
నేడు విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
విశాఖ నుంచి సికింద్రాబాద్కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. -
మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు అరుణ్ రెడ్డికి దిల్లీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?