955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు తెలంగాణ నివేదన
1,144 టీఎంసీలు కావాలన్న ఏపీ
కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2,099 టీఎంసీలు
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. తాగు నీటికి తీసుకొనే నీటిలో 20 శాతం, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగం 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. గోదావరి నుంచి మళ్లించడం ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిపై ఈ ట్రైబ్యునల్కు విచారణ పరిధి లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలలో 555 టీఎంసీలు తమ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మార్చి 20న తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేస్(ఎస్వోఎస్) దాఖలు చేయగా, ఆంధ్రప్రదేశ్ సోమవారం దాఖలు చేసింది. గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరినా, ఈ నెల 29లోగా దాఖలు చేసి తీరాల్సిందేనని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్లో దాఖలు చేయడంతోపాటు రెండు రాష్ట్రాలు పరస్పరం తమ స్టేట్మెంట్ ఆఫ్ కేసులను ఇచ్చి పుచ్చుకోగా, రెండూ కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తదుపరి వాదనలు జరగనున్నాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించగా, తర్వాత 2013లో తీర్పు చెప్పిన బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ శ్రీశైలం, నాగార్జునసాగర్లలోని క్యారీఓవర్ స్టోరేజీ సహా మరో 194 టీఎంసీలు అదనంగా కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 1,005 టీఎంసీలుగా పేర్కొంది. ఈ నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు రాష్ట్రాలు కలిపి తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాలు దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
బచావత్ కేటాయింపుల్లో తెలంగాణ వాటా 555 టీఎంసీలు
బచావత్ ట్రైబ్యునల్ 75 శాతం నీటి లభ్యత కింద కేటాయించిన 811 టీఎంసీలలో తమకు దక్కాల్సింది 555 టీఎంసీల కంటే తక్కువ కాదని, ఈ మేరకు కేటాయించాలని తెలంగాణ కోరింది. ‘‘కృష్ణా ట్రైబ్యునల్-2 అదనంగా 65 శాతం నీటి లభ్యత కింద చేసిన 43 టీఎంసీల కేటాయింపు మొత్తాన్ని మా వాటాగా ఇవ్వాలి. సరాసరి నీటి లభ్యత కింద కేటాయించిన 145 టీఎంసీలలో 120 టీఎంసీలకు తక్కువ కాకుండా ఇవ్వాలి. గోదావరి నుంచి కృష్ణాబేసిన్కు మళ్లించే నీటిలో 45 టీఎంసీలను మాకే కేటాయించాలి. సుప్రీంకోర్టులో ఉన్న సివిల్ అప్పీల్ 5178 కేసులో అదనంగా వచ్చే మొత్తం నీటిని తెలంగాణకు కేటాయించాలి. కృష్ణా బేసిన్కు బయట ఉన్న నాగార్జునసాగర్, కేసీ కాలువ, తుంగభద్ర హెచ్చెల్సీ, గుంటూరు ఛానల్ కింద ఆయకట్టును ఒక ఆరుతడి పంటకు మాత్రమే పరిమితం చేయాలి. 1976 తర్వాత కృష్ణా బేసిన్కు బయట 75 శాతం నీటి లభ్యత కింద చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని మళ్లించకుండా చూడాలి. బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకు 2,578 టీఎంసీలకు మించి వచ్చే మిగులు నీటిని పూర్తిగా వినియోగించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలి. బేసిన్ అవసరాలకు, బేసిన్లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు తెలంగాణకు చేసిన కేటాయింపులు కచ్చితంగా వచ్చేలా చూడాలి. రాష్ట్రంపై ప్రభావం చూపే ఏ ప్రాజెక్టులనూ ఆంధ్రప్రదేశ్ చేపట్టకుండా ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వాలి. నీటి కేటాయింపుల్లో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, ఆసిఫ్నగర్ ప్రాజెక్టుకు 2.54 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ఎస్.ఎల్.బి.సి.కి 40, కల్వకుర్తి ఎత్తిపోతలకు 53, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 25.4, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90, డిండి ఎత్తిపోతలకు 30 కలిపి 238.4 టీఎంసీలు కేటాయించాలి. ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 216.5 టీఎంసీలు, కృష్ణాట్రైబ్యునల్-2 జూరాలకు అదనంగా కేటాయించిన తొమ్మిది టీఎంసీలు కలిపి సాగునీటి అవసరాలకు మొత్తం 765.44 టీఎంసీలు అవసరం. తాగునీటికి 55.49, పశు సంపదకు 19.83, పారిశ్రామిక అవసరాలకు 107.54, థర్మల్ విద్యుత్తుకు 6.6 కలిపి 189.46 టీఎంసీలు కావాలి. ఇందులో వినియోగం లెక్కలోకి మాత్రం 24.36 టీఎంసీలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం వినియోగించుకొంటున్న 512 టీఎంసీలలో 291 టీఎంసీల ఆదా ఉంది’’ అని తెలంగాణ నివేదించింది.
ప్రాజెక్టు వారీ కేటాయింపుల్లో మార్పు చేయడానికి వీల్లేదు: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1 క్లాజ్ 9(ఇ)(1)(ఎ) కింద చేసిన కేటాయింపుల్లో ప్రాజెక్టు వారీ కేటాయింపులు చేసే సమయంలో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ‘‘బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 75 శాతం నీటి లభ్యత కింద చేసిన కేటాయింపులకు సంబంధించి పేర్కొన్న 28 ప్రాజెక్టులు, తర్వాత పునఃకేటాయింపులు జరిగినవి కలిపి వినియోగంలో ఉన్న ప్రాజెక్టులుగానే పరిగణించాలి. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలు పేరా పదిలో పేర్కొన్న ప్రాజెక్టులు, కేంద్రం 2022 జులై 27న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రాజెక్టులను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులుగా పరిగణించి కేటాయింపులు చేయాలి. పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు చేసిన తర్వాత కృష్ణాబేసిన్లోని మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే చెందుతాయి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు, ఆపరేషన్ ప్రొటోకాల్కు ఇండిపెండెంట్ ఏజెన్సీ అవసరం. అంతర్ రాష్ట్ర నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో ఉత్పత్తయ్యే విద్యుత్తు వాటా పంపిణీకి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వాస్తవాలు, పరిస్థితులకు అనుగుణంగా ట్రైబ్యునల్ తగిన ఆదేశాలు ఇవ్వకపోతే కృష్ణా నదిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్కు పూడ్చలేనంత నష్టం వాటిల్లుతుంది. నీటి కేటాయింపుల్లో బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 512 టీఎంసీలు, మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు 125.5 టీఎంసీలు, కృష్ణా ట్రైబ్యునల్-2 చేసిన కేటాయింపు 29 టీఎంసీలు, రాష్ట్రం పునర్విభజన తర్వాత అదనంగా వచ్చిన డిమాండ్ మేరకు 176.46, అదనంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 114.75 టీఎంసీలు కలిపి సాగునీటికి 957.71 టీఎంసీలు అవసరం. తాగునీటికి 140.62, పారిశ్రామిక అవసరాలకు 29.23, నేవిగేషన్కు 14, జల విద్యుత్తుకు రెండు టీఎంసీలు కావాలి. మొత్తం అన్ని అవసరాలకు 1,143.56 టీఎంసీలు అవసరం’’ అని ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్ను కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. -
హింస పెచ్చరిల్లుతుంటే మీరేం చేస్తున్నారు?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. -
తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య దమనకాండ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్కే చైతన్య తెదేపా నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. తెదేపా నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మేడిగడ్డపై పీటముడి!
మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. -
నెలాఖరులోగా కొత్త వీసీలు
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. -
ఏఐతో ఎంచక్కా వైద్యం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
తియ్యటి జొన్న.. ఇథనాల్లో మిన్న!
తెల్ల, పచ్చ జొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. -
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచారం
తిరుమల ఘాట్రోడ్డులో చిరుత సంచరించడం కలకలం సృష్టించింది. ఈ నెల 12న భక్తుల బృందం కారులో అలిపిరి నుంచి తిరుమలకు రెండో ఘాట్రోడ్డులో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డును దాటడం డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయింది. -
జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలతోపాటు నిందితులు దాఖలు చేసిన సుమారు 130 డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణను హైదరాబాద్ సీబీఐ ప్రధాన కోర్టు జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. -
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
వేధించాడని జైలుశిక్ష... పెళ్లి చేసుకున్నాడని విముక్తి
ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి కింది కోర్టు రెండున్నరేళ్ల శిక్ష విధిస్తే, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని 3నెలలకు తగ్గించింది. -
సుంకం చెల్లించని మద్యం స్వాధీనంలో రికార్డు!
లోక్సభ ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్)తో పాటు ఇతర మాదకద్రవ్యాల స్వాధీనంలో తెలంగాణ ఆబ్కారీశాఖ రికార్డు సృష్టించింది. -
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి
విద్యుత్ సంస్థల్లో గతంలో ఇచ్చిన పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. -
కేయూలో తాత్కాలిక అధ్యాపకుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. -
45% ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను పీఆర్టీయూ తెలంగాణ సంఘం కోరింది. -
పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం.. అకాడమీకి జరిమానా
పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
తడిసిన ధాన్యం.. కర్షకుడి దైన్యం
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హనుమకొండ, వరంగల్లో మూడు రోజుల క్రితం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. -
15% స్థానికేతర కోటాపై సందిగ్ధత
ఏపీలో అమలు చేస్తున్న 15% స్థానికేతర(ఓపెన్) కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. -
ఎన్నికల విధుల వేతనాల్లో వ్యత్యాసాలు తొలగించాలి
లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే వేతనాల్లో వ్యత్యాసాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది.