రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Published : 30 Apr 2024 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కేసు పురోగతిలో ఉందని, బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని