‘టెయిల్‌పాండ్‌’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి

తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్‌ దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది.

Published : 30 Apr 2024 04:04 IST

ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్‌ దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. ఈ నెల 13న తూములు తెరిచి నీటిని ఎందుకు మళ్లించారో తెలియజేయాలని లేఖలో కోరింది. ఏపీ ప్రభుత్వం 3 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్‌ నుంచి తరలించిందంటూ ఇటీవల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ అంశంపై చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో బోర్డు స్పందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని