మే 24న పాలిసెట్‌

పాలిటెక్నిక్‌ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్‌’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎన్‌.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Apr 2024 04:05 IST

కార్వాన్‌, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్‌’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎన్‌.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లను కేటాయిస్తామన్నారు. వివరాలను మాసబ్‌ట్యాంక్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో లేదా వెబ్‌సైట్‌ https://polycet.sbtet.telangana.
gov.in
లో  తెలుసుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని