తాండూరు కందులకు రికార్డు ధర

వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్‌ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్‌ పర్యవేక్షకులు హబీబ్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 04:07 IST

క్వింటాలుకు రూ.12,705

న్యూస్‌టుడే, తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్‌ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్‌ పర్యవేక్షకులు హబీబ్‌ తెలిపారు. రైతులు 137 క్వింటాళ్ల కందులను విక్రయానికి తీసుకురాగా.. తాండూరు కందులకు డిమాండ్‌ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. నాణ్యత తక్కువ ఉన్న కందులకు సగటు ధర రూ.11,421 పలికింది. మంచి ధర రావడంతో రైతులకు ఆర్థిక ప్రయోజనం కలిగించిందని ఆయన చెప్పారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని