హైదరాబాద్-విజయవాడ రహదారి దిద్దుబాటు పనులు చేపట్టండి
‘హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిద్దుబాటు పనులను వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ధారిత సమయంలో పూర్తి చేయాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఆయన ఆర్అండ్బీ, జాతీయ రహదారుల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. చౌటుప్పల్ నుంచి తెలంగాణ సరిహద్దు సమీపంలోని నవాబ్పేట వరకు 17 ప్రాంతాల్లో అండర్ పాస్లు, సర్వీసు రోడ్లు, జంక్షన్ల అభివృద్ధికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మార్గంలోని బ్లాక్స్పాట్స్ను చక్కదిద్దేందుకు గుత్తేదారు సంస్థ భూ పరీక్షలు నిర్వహించింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ జాతీయ రహదారి గుండా పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి తాజా సమీక్షా సమావేశంలో ఒప్పందం మేరకు ఆయా పనులు చేపట్టడం, వేగ నియంత్రణకు సంబంధించిన సైన్బోర్డుల ఏర్పాటు తదితర పనులపై చర్చించారు. పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రాంతీయ రింగు రోడ్డు భూ సేకరణ ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఇతర జాతీయ రహదారుల నిర్మాణాల తీరుతెన్నులపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి రజాక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై మూడు నెలల్లో నివేదిక
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి వెల్లడించారు. -
వాటాల బదలాయింపు కేసులో నిందితులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఓ ప్రైవేటు కంపెనీలోని వాటాల బదలాయింపు కేసులో నిందితులైన రాజశేఖర్ తలసిల్ల, చంద్రశేఖర్ వేగెలను అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
యాదాద్రి మే నెల ఆదాయం రూ.18.49 కోట్లు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మే నెలలో భక్తుల ద్వారా లభించిన ఆదాయ వివరాలను దేవస్థానం శనివారం విడుదల చేసింది. మే నెలలో ఆలయానికి అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా రూ.18.49 కోట్లు సమకూరినట్లు దేవస్థానం వెల్లడించింది. -
అణువణువూ పరిశీలన...
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా ఇందులో భాగమైన సాంకేతిక నిపుణుల బృందం శనివారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. -
హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని
తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందన్నారు. -
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దు: భట్టి
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని స్థాయుల్లోని విద్యుత్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా వ్యూహాత్మక ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు. -
రైతులకు మేలు చేసే పథకాలనే అమలు చేస్తాం
-
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 1.5 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్లు వివరించింది. -
పార్టీలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు: మంత్రి పొన్నం
పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు శనివారం పరిశీలించారు. -
బినామీ ఖాతాలతో మేశారు
గొర్రెల పథకం కుంభకోణంలో దళారులు, అధికారులు కలిసి సుమారు రూ.700 కోట్ల నిధులు కాజేసిన తీరు అవినీతి నిరోధక శాఖ(అనిశా) దర్యాప్తులో తేటతెల్లమైంది. -
దశదిశలా దశాబ్ది సంబురం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జూన్ 2న (ఆదివారం) ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయింది.
తాజా వార్తలు (Latest News)
-
పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!