Antarctica: అంటార్కిటికాలో అర్జెంటీనా సైజు హిమఫలకం అదృశ్యం.. ఆందోళనలో శాస్త్రవేత్తలు
అంటార్కిటాకా వాతావరణ మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకొంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి మంచు కరిగిపోయింది.
ఇంటర్నెట్డెస్క్: ఉత్తరార్ధ గోళంలో నెలకొన్న అత్యధిక ఉష్ణోగ్రతలు అంటార్కిటికా(Antarctica)లో మంచు ఫలకాలను శరవేగంగా కరిగించేస్తున్నాయి. తాజాగా అంటార్కిటికా ఖండంలో ఓ భారీ హిమఫలకం కరిగిపోయింది. ఇక్కడి సముద్రంలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి మంచు పడిపోయింది. వాస్తవానికి ఏటా ఎండాకాలంలో మంచు కరిగి తిరిగి శీతాకాలంలో భారీ హిమఫలకాలు ఏర్పడటం ఇక్కడ సాధారణమే. కానీ, ఈ సారి మాత్రం గతంలో వలే ఈ సారి మంచు ఏర్పడకపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మంచు ఉంది. గత శీతాకాలం(2022)తో పోల్చుకొంటే 16లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు తగ్గినట్లు నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ గణాంకాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్తో కాల్పుల విరమణను వ్యతిరేకించలేదు : పుతిన్
1981-2010 మధ్య నెలకొన్న సగటు కంటే ఈ ఏడాది జులై మధ్యలో అంటార్కిటికా సముద్రంలో 26లక్షల చదరపు కిలోమీటర్ల మంచు తక్కువగా ఉంది. ఈ విస్తీర్ణం దాదాపు అర్జెంటీనా దేశానికి సమానం. దాదాపు 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొలారాడో బౌల్డర్ యూనివర్శిటికి చెందిన గ్లేసియాలజిస్టు టెడ్ స్కాంబోస్ పేర్కొన్నారు. ‘‘పరిస్థితి పూర్తిగా మారిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.
అంటార్కిటిక్లో కొన్ని దశాబ్దాల్లోనే మంచు అత్యధిక స్థాయి నుంచి అత్యల్ప స్థాయికి చేరింది. ఈ ప్రాంతం ప్రపంచంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను కలవరానికి గురిచేస్తున్నాయి. 2016 నుంచి ఇక్కడ సముద్రంలో మంచు నిరంతరం కరుగుతున్నట్లు గుర్తించారు. ‘‘అంటార్కిటిక్లో పరిస్థితులు తరచూ మారుతుంటాయి. ప్రస్తుత మార్పు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. గత రెండేళ్లలో ఏదో పెనుమార్పు చోటు చేసుకొంది’’ అని గ్లేసియాలజిస్టు టెడ్ స్కాంబోస్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారిగా పంది కిడ్నీని మార్పిడి చేయించుకున్న అమెరికాకు చెందిన రిచర్డ్ స్లేమాన్(62) శనివారం మరణించినట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!