FBI: సులేమానీపై దాడికి ప్రతీకారం కోసం అమెరికాలోకి ఇరాన్ ఏజెంట్లు.. ఎఫ్బీఐ వేట..!
ఇరాన్ ప్రతీకారం తీర్చుకొనేందుకు తన ఏజెంట్లను అమెరికాలోకి పంపింది. ఈ విషయాన్ని అక్కడి ఎఫ్బీఐ కనిపెట్టింది.
ఇంటర్నెట్డెస్క్: ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకొనేందుకు ఇరాన్ (Iran) చేసిన యత్నాలను అమెరికా భద్రతా సంస్థ ఎఫ్బీఐ (FBI) పసిగట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్గా పనిచేసిన మైక్ పాంపియో, ట్రంప్ తరఫున టెహ్రాన్ దూతగా పనిచేసిన బ్రయాన్ హుక్ను లక్ష్యంగా చేసుకొన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ ఏజెంట్ మాజిద్ దస్తజాని ఫర్హానీ అనే వ్యక్తి కొందరు హంతకులను నియమించుకొన్నట్లు గుర్తించింది. ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి గత వారం మియామీలోని ఎఫ్బీఐ ఆఫీసు సమాచారం సేకరించడం మొదలుపెట్టింది. అతడు తరచూ ఇరాన్, వెనుజువెలా మధ్య ప్రయాణించినట్లు గుర్తించింది. టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్లు పేర్కొంది. ఇరాన్ టార్గెట్ చేసుకొన్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది. డిసెంబర్లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు కూడా విధించింది.
ఫర్హానీ లక్ష్యంలోని వారి కదలికలను గుర్తించేందుకు వీలుగా ప్రార్థనా మందిరాలు, వ్యాపారాలు, ఇతర కార్యాలయాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అతడు ఇరాన్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ కోసం పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
2020 జనవరిలో సీఐఏ డ్రోన్ ఒకటి ఇరాన్ జనరల్ సులేమానీ కాన్వాయ్పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు మరణించాడు. నాడు ప్రతీకారం తీర్చుకొంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. దీనిలో భాగంగానే నాటి సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియోను లక్ష్యంగా చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయనకు ముప్పు పెరిగిన విషయాన్ని గతంలోనే గుర్తించిన అమెరికా ప్రభుత్వం 24 గంటలపాటు రక్షణ కల్పిస్తోంది.
ఇజ్రాయెల్పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి
ట్రంప్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ను కూడా హత్య చేసేందుకు 2022లో ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కీలక అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
-
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో