శరణార్థి శిబిరంపై దాడులేంటి?
శరణార్థుల శిబిరంపై, అంబులెన్సుల వాహన శ్రేణిపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. దీనివెనుక ఆలోచన ఏమిటో వివరణ ఇవ్వాలంది.
ఇజ్రాయెల్ను ప్రశ్నించిన అమెరికా
అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో బ్లింకెన్ భేటీ
టెల్అవీవ్: శరణార్థుల శిబిరంపై, అంబులెన్సుల వాహన శ్రేణిపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. దీనివెనుక ఆలోచన ఏమిటో వివరణ ఇవ్వాలంది. సాధారణ పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లని రీతిలో తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న వ్యతిరేకతనూ లెక్కచేయకుండా ఇజ్రాయెల్ చేస్తోన్న దాడులపై అమెరికా ఆగ్రహంగా ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శనివారం జోర్డాన్లో అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో యుద్ధానికి ఎలా తెరదించాలనే అంశంపై చర్చలు జరిపారు. యుద్ధానికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణం తగిన చర్య చేపట్టాలని జోర్డాన్ ఈ సందర్భంగా కోరింది. పరిస్థితిని మెరుగుపరిచే చర్యల్ని చేపట్టకపోతే విధ్వంసకర పరిణామాలు తప్పవని బ్లింకెన్ హెచ్చరించారు. సైనిక కార్యకలాపాలను ఇజ్రాయెల్ నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ‘పిల్లల ముందే తండ్రిని చంపేయడం వంటి క్రూర ఘటనలు దిగ్భ్రాంతికరం. గాజాలో పాలస్తీనా పిల్లల మృతదేహాల చిత్రాలు చూసినప్పుడు వారిలో నాకు మా పిల్లలు కనిపించారు. హృదయం ద్రవించిపోయింది’ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తుర్కియే వెళ్తారు.
బంకర్లలో దాక్కొంటున్న నస్రల్లా: ఇజ్రాయెల్
జెరూసలెం: హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మాటలు విసుగుపుట్టించేలా ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎద్దేవా చేసింది. ఆయన బంకర్లలో దాక్కుంటున్నాడని చురకలు అంటించింది. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా చేస్తున్న హెచ్చరికలను తాము పట్టించుకోబోమంటూ నస్రల్లా తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి ఇజ్రాయెల్ బదులిచ్చింది. కేవలం సరిహద్దు దాడులకే తాము పరిమితం కాబోమని, దేనికైనా సిద్ధమని నస్రల్లా.. అమెరికాను హెచ్చరించారు. అమెరికా తలచుకుంటే గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని అడ్డుకోగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
సరిపడా ఆయుధాలున్నాయ్.. ఎన్ని నెలలైనా పోరాడుతాం
గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా తాము ఒత్తిడి తీసుకురాగలమని హమాస్ పేర్కొంది. సరిపడా ఆయుధాలు తమవద్ద ఉన్నాయని, ఎన్ని నెలలైనా యుద్ధం చేస్తామని స్పష్టంచేసింది. ‘‘మా వద్ద ఆయుధాలు, క్షిపణులు, ఆహారం, ఔషధ నిల్వలు ఉన్నాయి. గాజా సిటీ భూగర్భ ప్రాంతాల్లో మేం కొన్ని నెలలపాటు ఉండగలం’’ అని హమాస్ నేతలు చెబుతున్నారు. హమాస్ వద్ద 40వేల మంది ఫైటర్లు ఉన్నట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. వీరంతా గాజాలో 80 మీటర్ల లోతు సొరంగాల్లో ఉన్నారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..