అమెరికాలో సుడిగాలి బీభత్సం

అమెరికాలోని టెన్నసీ రాష్ట్రంలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. వీటి ధాటికి శనివారం ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 11 Dec 2023 07:07 IST

ఆరుగురి మృతి, 23 మందికి గాయాలు

నాష్‌విల్‌: అమెరికాలోని టెన్నసీ రాష్ట్రంలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. వీటి ధాటికి శనివారం ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సుడిగాలుల విధ్వంసానికి టెన్నసీ నగరంలో ఇళ్లు  ధ్వంసం కావడంతోపాటు శనివారం రాత్రంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుడిగాలులు నగరాన్ని తాకాయి. టెన్నసీని మరిన్ని సుడిగాలులు తాకే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు హెచ్చరికలు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని