ప్రయాణికులతో సంప్రదిస్తున్నాం
మానవ అక్రమ రవాణా అనుమానంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని పారిస్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
ఫ్రాన్స్లో విమానం నిలిపివేతపై స్పందించిన భారత ఎంబసీ
కొనసాగుతున్న విచారణ
పారిస్: మానవ అక్రమ రవాణా అనుమానంతో భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని పారిస్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పారిస్ అధికారులు అందించిన సమాచారం మేరకు ప్రయాణికులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ‘‘విమాన ప్రయాణికులు, సిబ్బంది గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్నాం. వారి ప్రయాణానికి గల కారణాలు ఆరా తీస్తున్నాం’’ అని పారిస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఫ్రాన్స్లోని జాతీయ వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. రొమేనియా సంస్థ లెజెండ్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు వెళుతూ ఇంధనం నింపుకోవడం కోసం పారిస్కు 150 కి.మీ.ల దూరంలోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని అందిన సమాచారం మేరకు ఫ్రాన్స్ అధికారులు ఆ విమానాన్ని తమ అధీనంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే. విమానంలోని 303 మంది ప్రయాణికుల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. వారిలో 13 మంది మైనర్లు అని స్థానిక పత్రిక వెల్లడించింది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించేందుకుగాను సెంట్రల్ అమెరికాకు చేరుకునే ప్రణాళికలో భాగంగా వీరంతా నికరాగువాకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఫ్రెంచ్ అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెజెండ్ ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?