ఇజ్రాయెల్కు భారీ షాక్
హమాస్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అతి పెద్ద దెబ్బ తగిలింది. మధ్య గాజాలో సోమవారం జరిగిన ఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు.
మధ్యగాజాలో గ్రనేడ్తో దాడిచేసిన మిలిటెంట్లు
పేలుళ్లు జరిగి 21 మంది సైనికుల సజీవ సమాధి
జెరూసలెం: హమాస్తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అతి పెద్ద దెబ్బ తగిలింది. మధ్య గాజాలో సోమవారం జరిగిన ఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు. సరిహద్దుకు 600 మీటర్ల దూరంలోని కిస్సుఫింలో రెండు భవనాలను పేల్చేందుకు ఇజ్రాయెల్ సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. అదే సమయంలో సమీపంలోనే ఉన్న మిలిటెంట్లు యుద్ధ ట్యాంకుపైకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్ను (ఆర్పీజీ) ప్రయోగించారు. పక్కనే ఉన్న మందుగుండు సామగ్రి పేలి రెండు భవనాలు కుప్పకూలాయి. వాటి కింద 21 మంది సైనికులు సజీవ సమాధి అయ్యారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఇజ్రాయెల్ సైనికులు అంత మంది ఒకేసారి మరణించడం ఇదే తొలిసారి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మంగళవారం తెలిపారు. ఆ సమయంలో చాలా మంది సైనికులు అక్కడే ఉన్నారని చెప్పారు. రెండో ఆర్పీజీ భవనాలను తాకిందని వివరించారు. మృత దేహాలను వెలికితీయడానికి సైనిక దళాలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనుందని తెలుస్తోంది.
తమ సైనిక సిబ్బంది మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నెతన్యాహు.. హమాస్పై సంపూర్ణ విజయం సాధించేవరకూ పోరాడతామని మరోసారి స్పష్టం చేశారు. బందీలను విడిపించుకుంటామని చెప్పారు. ఇది తమకు అత్యంత కఠిన సమయమని తెలిపారు.
గాజాలో 50 మంది మృతి
ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. గాజాలో రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ను తమ బలగాలు చుట్టుముట్టినట్లు తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. కొంతకాలంగా ఖాన్ యూనిస్లో తీవ్ర పోరు కొనసాగుతోంది. హమాస్ అగ్ర నేతలు ఈ నగరం కింద సొరంగాల్లో దాక్కున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. పైగా ఇది హమాస్ అగ్ర నేత యాహ్యా సిన్వర్ స్వస్థలం. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాజాలో సోమవారం ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలింది. ఇలా జరగడం ఇది పదోసారి.
రెండు నెలల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం?
శాశ్వతంగా కావాలంటున్న హమాస్
జెరూసలెం: యుద్ధంలో రెండు నెలల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఈజిప్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాలంలో బందీలను విడుదల చేసుకుందామని ఆ దేశం ప్రతిపాదించినట్లు వెల్లడించారు. టాప్ హమాస్ నాయకులూ గాజా విడిచి వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు వివరించారు. అయితే హమాస్ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆ అధికారి తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణను, గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని కోరుతోందని పేర్కొన్నారు.
హూతీలపై మరోసారి దాడులు
వాషింగ్టన్: యెమెన్లోని 8 హూతీ స్థావరాలపై సోమవారం రాత్రి అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు బాంబు దాడులు చేశాయి. హూతీ క్షిపణుల గోదాములపై యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తోమహాక్ క్షిపణులను ప్రయోగించాయని అధికారులు వెల్లడించారు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, లాంచర్లతోనూ దాడులు చేశామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
సొంత సైన్యంపైనే కాల్పులు జరపడంతో ఐడీఎఫ్కు భారీ నష్టం వాటిల్లింది. పొరపాటున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. -
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
Fraud: అగ్రరాజ్యంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు కేవలం 12 సెకన్లలోనే రూ.200 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని దోచేశారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు