సహాయం కోసం వేచి ఉన్నవారిపై దాడి
గాజా సిటీలో మానవతా సాయం కోసం వేచి ఉన్న వారిపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 20 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు.
గాజా సిటీలో 20 మంది మృతి
బాధితుల శిబిరంపై దాడిలో మరో 12 మంది
జెరూసలెం, బీరుట్: గాజా సిటీలో మానవతా సాయం కోసం వేచి ఉన్న వారిపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 20 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మరోవైపు ఖాన్యూనిస్లో కిక్కిరిసి ఉన్న బాధితుల శిబిరంపై బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు. 75 మంది గాయపడ్డారు. రెండు ట్యాంకులతో ఈ దాడి జరిగిందని ఐరాస సహాయక సంస్థ వెల్లడించింది. అయితే ఈ దాడిని తాము చేయలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. కానీ ట్యాంకులు ఇజ్రాయెల్వద్దే ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి ఖాన్యూనిస్లోని ఓ ఆసుపత్రిని శరణార్థులు ఖాళీ చేశారు. వందల మంది రోగులు, వేల మంది నిరాశ్రయులు ఆసుపత్రిని వదిలివెళ్లారు.
కాల్పుల్లో అమెరికా యువకుడి మృతి
పాలస్తీనా సంతతికి చెందిన అమెరికా యువకుడు తౌఫిక్ అబ్దుల్ జబ్బార్ (17) ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించాడు. వెస్ట్బ్యాంకులోని యాష్-షర్కియాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కులో వెళ్తున్న తౌఫిక్పై ఎటువంటి కవ్వింపు లేకుండానే ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారని, ట్రక్కు దిగి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అతడి స్నేహితుడు సలామే తెలిపాడు. అయితే రాళ్లు విసిరినందుకే కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ అంటోంది. దీనిని సలామే గురువారం ఖండించాడు. ఒకవేళ తాము రాళ్లు విసిరితే అరెస్టుకు అవకాశముందని, కానీ చేయలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
Fraud: అగ్రరాజ్యంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు అన్నాతమ్ముళ్లు కేవలం 12 సెకన్లలోనే రూ.200 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని దోచేశారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్