ఆమెకు రూ.692 కోట్లు చెల్లించండి
అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు భారీ జరిమానా
‘‘కిందికి పడదోసినపుడు మళ్లీ లేచి నిలబడిన ప్రతి మహిళ సాధించిన గొప్ప విజయమిది. ఆడవాళ్లను అణగదొక్కాలని చూసే ప్రతి తుంటరికి ఇది భారీ ఓటమి’’
మాన్హటన్ ఫెడరల్ కోర్టు తీర్పు అనంతరం జీన్ కరోల్ ప్రకటన
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ (80) దాఖలు చేసిన పరువునష్టం కేసులో న్యూయార్క్లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్ ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692.4 కోట్లు) అదనంగా చెల్లించాలని ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్ ఇటీవల దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్ డాలర్లతోపాటు భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై శుక్రవారం ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ట్రంప్ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
వాస్తవానికి ఈ కేసులో ట్రంప్నకు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించింది. జీన్ కరోల్ను ట్రంప్ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 5 మిలియన్ డాలర్లు (రూ.41.5 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కరోల్ తన రచనలను అమ్ముకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ విమర్శించడంతో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసునే తాజాగా మాన్హటన్ ఫెడరల్ కోర్టు విచారించి.. బాధితురాలికి అదనంగా మరో 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును హాస్యాస్పదంగా పేర్కొన్న ట్రంప్.. బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మన న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. ఈ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు’’ అని మండిపడ్డారు. తాజా తీర్పుపైన పైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ అసలు వివాదం..
1996లో మాన్హటన్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోరులో కరోల్కు ట్రంప్ పరిచయమయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్ తనతో మాట కలిపారని, డ్రెస్సింగ్ రూంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ అనూహ్య ఘటనతో షాక్కు గురై.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఓ పుస్తకంలో కరోల్ వెల్లడించిన వివరాలను న్యూయార్క్ మ్యాగజీన్ 2019లో ప్రచురించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వ్యవహారం న్యాయస్థానం దాకా వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
నేపాల్కు చెందిన షెర్పా కమీ రీటా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 29 సార్లు విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. -
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారిగా పంది కిడ్నీని మార్పిడి చేయించుకున్న అమెరికాకు చెందిన రిచర్డ్ స్లేమాన్(62) శనివారం మరణించినట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు