మళ్లీ బైడెన్-ట్రంప్ ఢీ
అగ్రరాజ్య అధ్యక్ష పీఠానికి ఇక సమరం మొదలైనట్లే. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిగిన ప్రైమరీల్లో విజయాలు సాధించి తమ పార్టీ నామినేషన్లకు అవసరమైన ప్రతినిధులను సొంతం చేసుకున్నారు.
ఖరారైన అమెరికాఅధ్యక్ష పోరు
పార్టీ నామినేషన్లు నెగ్గిన ఇరువురు నేతలు
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠానికి ఇక సమరం మొదలైనట్లే. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జరిగిన ప్రైమరీల్లో విజయాలు సాధించి తమ పార్టీ నామినేషన్లకు అవసరమైన ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. నవంబరు ఐదున జరిగే 2024 అధ్యక్ష పోరులో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యారు. 81 ఏళ్ల బైడెన్ జార్జియా ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో విజయం సాధించి, డెమొక్రటిక్ పార్టీ అధికారిక నామినేషన్కు అవసరమైన 1968 మంది ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. బైడెన్ అభ్యర్థిత్వాన్ని జులైలో జరిగే జాతీయ కన్వెన్షన్లో పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. మంగళవారం జార్జియా, హవాయి, మిసిసిపీ, వాషింగ్టన్ రాష్ట్రాలకు, ఒక టెరిటరీకి ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. 77 ఏళ్ల ట్రంప్ కూడా వాషింగ్టన్లో నెగ్గి, రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి అవసరమైన 1215 మంది ప్రతినిధుల మార్కును దాటారు. దీంతో వరుసగా మూడోసారి పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలిచారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆగస్టులో జరిగే జాతీయ కన్వెన్షన్లో పార్టీ ఖరారు చేయనుంది. 1956 తర్వాత వరుసగా రెండు అధ్యక్ష ఎన్నికల్లో ఒకే ప్రత్యర్థుల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. 1952లో ఐసెన్ హోవర్, స్టీవెన్సన్ మధ్య పోరు జరిగింది. హోవర్ నెగ్గారు. 1956లోనూ వీరిద్దరే తలపడ్డారు. అప్పుడు కూడా హోవర్నే అద్యక్ష పదవి వరించింది. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్, ట్రంప్నకు పెద్దగా ప్రతిఘటన ఎదురవ్వలేదు. ట్రంప్నకు వ్యతిరేకంగా నిక్కీ హేలీ, రాన్ ది శాంటిస్ తదితరులు బరిలోకి దిగినా మధ్యలోనే వైదొలిగారు. బైడెన్కు కూడా నామమాత్ర పోటీ ఎదురైంది. వీరిద్దరూ అధ్యక్ష పోరులో నిలుస్తారన్నది అందరూ ఊహించిందే. అయితే దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో 91 నేరాభియోగాలను ఎదుర్కొంటూ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు. గతంలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థి ఎవరూ అధ్యక్ష బరిలో దిగలేదు. మెజారిటీ ప్రతినిధులను గెలవగానే బైడెన్ మాట్లాడుతూ.. మరోసారి తనపై విశ్వాసం ఉంచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్తో దేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా బైడెన్పై ధ్వజమెత్తారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని, ఆయన్ను ఓడించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
వైట్ హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు సంతతి కుర్రాడు సాయివర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నానని విచారణలో చెప్పాడు. -
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ స్మగ్లర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వేల మందిని ఇతడి గ్యాంగ్ ఐరోపా, యూకేలోకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. -
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
India-US: ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్ట్పై భారత్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?