Hamas: గాజాకు సహాయ ట్రక్కు.. లూటీ చేసిన హమాస్

ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్-హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికా జోక్యంతో సంధి కుదిరినప్పటికీ.. వాటిని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు కొనసాగిస్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఊపిరి పీల్చుకుంటున్న పాలస్తీనావాసుల్లో మళ్లీ గుబులు మొదలైంది. మరో వైపు గాజా ప్రజల కోసం పంపుతున్న మానవతా సాయాన్ని హమాస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అమెరికా ఆరోపించింది. అందుకు సంబంధించిన డ్రోన్ (US military drone) దృశ్యాలను యూఎస్ (US) సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శనివారం దక్షిణ గాజా స్ట్రిప్లోకి ప్రవేశించిన సహాయ ట్రక్కును హమాస్ కార్యకర్తలు అడ్డుకున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. డ్రైవర్పై దాడి చేసి.. దానిని లూటీ (Hamas loots Gaza aid truck) చేసినట్లు అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ భాగస్వాముల నుంచి గాజా ప్రజలకు అందే మానవతా సాయాన్ని కూడా హమాస్ అడ్డుకుంటుండడంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించిపోతున్న గాజా ప్రజలకు చేరాల్సిన సాయాన్ని అందకుండా చేసి.. హమాస్ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గాజాలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును ఇటువంటి ఘటనలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దాదాపు 40 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు మానవతా సహాయాన్ని అందిస్తున్నాయన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే ఈ ఆదేశాలిచ్చామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల మృతదేహాలను హమాస్ సంస్థ ఇజ్రాయెల్కు అప్పగిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
అమెరికా, చైనాలతో పాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్గా భారత్ నిలవనుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని పాక్కు చెందిన ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. - 
                                    
                                        

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
Neal Katyal: ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టులో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ వాదించనున్నారు. - 
                                    
                                        

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
ఇస్లాం ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
Indian student visa: కెనడాలో భారత విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. - 
                                    
                                        

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. - 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


