Israel-Hamas: భీకరంగా భూతల పోరు.. హమాస్ కీలక కమాండర్లు హతం..!
Israel-Hamas: హమాస్ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ దళాలు.. భూతల పోరును మరింత తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే పలువురు హమాస్ కీలక కమాండర్లను చంపినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఖాన్ యూనిస్: భూతల పోరులో కీలక దశకు చేరుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ (Israel) దళాలు.. గాజా (Gaza) నగరంలో తీవ్ర పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో తమ గ్రౌండ్ ఫోర్సెస్.. అనేక మంది హమాస్ (Hamas) ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వెల్లడించింది. ఇందులో ఆ ముఠాకు చెందిన నఖ్బా విభాగంలో కీలక కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపింది.
అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన నరమేధంలో ఈ నఖ్బా దళాలు కీలకంగా పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో భూతల దాడుల్లో ఈ విభాగంపై ఐడీఎఫ్ నిఘా పెట్టింది. షిన్బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన నిఘా సమాచారంతో జబాలియా ప్రాంతంలో ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో నఖ్బా కీలక కమాండర్లు అహ్మద్ మౌసా, అమర్ అల్హంది హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్ ఆర్మీ పోస్ట్, జికిమ్ బేస్పై దాడికి మౌసా నాయకత్వం వహించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
కాల్పుల విరమణ అంటే హమాస్కు లొంగిపోవడమే: ఇజ్రాయెల్
మరోవైపు, ఉత్తర గాజాలో చాలా దూరం చొచ్చుకొచ్చిన ఐడీఎఫ్ దళాలు.. అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రి సమీపంలోకి చేరుకున్నాయి. ఈ ఆసుపత్రి కింద.. హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, దానిని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ హమాస్ దళాలతో తీవ్ర పోరు జరుగుతోందని తెలిపింది. ఈ పోరులో పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది. మరోవైపు, ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో 13 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
యుద్ధం విస్తరణ అనివార్యమే: ఇరాన్
ఇదిలా ఉండగా.. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల కారణంగా గాజాలో పౌరుల మరణాలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం ఖాయంగానే కన్పిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దుల్లా హెచ్చరించారు. ‘‘గాజాలో పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్ తమ దాడులను నానాటికీ విస్తరిస్తోంది. అటు అమెరికా దౌత్య ప్రయత్నాలు చేస్తూనే.. తమ నౌకాదళాన్ని తూర్పు మధ్యదరా సముద్రంలో మోహరిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం అనివార్యంగా కన్పిస్తోంది’’ అని ఇరాన్ మంత్రి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
నేపాల్కు చెందిన షెర్పా కమీ రీటా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 29 సార్లు విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించాడు. -
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
ప్రపంచంలోనే తొలిసారిగా పంది కిడ్నీని మార్పిడి చేయించుకున్న అమెరికాకు చెందిన రిచర్డ్ స్లేమాన్(62) శనివారం మరణించినట్లుగా అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్ అమల్లోకి వచ్చి 112 ఏళ్లు దాటింది. ప్రస్తుతం అక్కడ పాలకుల కారణంగా ఈ వ్యవస్థ కొంత మసక బారింది. -
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
తాము అవసరమైతే అణుబాంబు తయారీకి వెనుకాడమని ఇరాన్ తేల్చిచెప్పింది. -
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
పేరుకే అక్కడ నిర్బంధ ఓటింగ్.. కానీ, ఓటర్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటుంది. అయినా కానీ, ఓటు వేసేందుకు ఎవరైనా మొరాయిస్తే కొరడా ఝుళిపిస్తుంది. ఆ విశేషాలేంటో చూద్దాం.. -
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు
Canada: నిజ్జర్ హత్య కేసులో బ్రాంప్టన్ ప్రాంతంలో నివాసముంటున్న అమర్దీప్ సింగ్ను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. -
సౌమ్యా స్వామినాథన్కు గౌరవ డాక్టరేట్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్గా విధులు నిర్వహించిన డాక్టర్ సౌమ్యా స్వామినాథన్కు ప్రతిష్ఠాత్మక మెక్గిల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. -
అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
అఫ్గానిస్థాన్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బదాక్షాన్, బగ్లాన్, ఘోర్, హెరాత్ ప్రావిన్సుల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బగ్లాన్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. -
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్
రఫాపై భారీ దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ -
విశ్రాంతి కరవైన చోదకుడు బస్సును నదిలోకి నడిపాడు
రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. అదుపుతప్పిన బస్సు వాహనాలను ఢీకొంటూ వెళ్లి నేరుగా వంతెన పైనుంచి నదిలో పడిపోయిన దృశ్యాలు అందులో ఉన్నాయి. -
బాలుడి మృతదేహాన్ని వదిలేసిన విమాన సంస్థ
తల్లిదండ్రుల వెంట విమానంలో పాక్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్థాన్కు వెళ్లాల్సిన ఆరేళ్ల బాలుడి మృత దేహాన్ని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) సిబ్బంది ఇస్లామాబాద్ విమానాశ్రయంలో వదిలేశారు. -
ట్రంప్నకు బైడెన్ చురక
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరించే పనిలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు నిమగ్నమయ్యాయి. -
రాకెట్ లాంచింగ్ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా
కిమ్జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా మరోసారి తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. బహుళ రాకెట్ లాంచింగ్ వ్యవస్థ సన్నాహక పరీక్షను నిర్వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ