Hamas: డెయిఫ్ ఫొటో సాధించాం.. ఉత్తరగాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్
హమాస్ అగ్రనేత ఫొటోను ఎట్టకేలకు ఐడీఎఫ్ సంపాదించింది. ఉత్తర గాజాలో ఆ సంస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీసినట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: హమాస్(Hamas)పై దాడులు మొదలు పెట్టిన మూడు నెలల తర్వాత.. ఉత్తర గాజాలో దాని కమాండ్ వ్యవస్థ మొత్తాన్ని తుడిచిపెట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. హమాస్లో అతి ముఖ్యమైన కమాండర్ మహమ్మద్ డెయిఫ్ ఫొటోను సంపాదించింది.
‘‘ఉత్తర గాజా పట్టీలో హమాస్ సైనిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశాం. ఇప్పుడు దానికి కమాండర్లు లేరు. దీంతో చెదురుమదురు దాడులకు మాత్రమే పాల్పడుతోంది. ఇప్పుడు మధ్య గాజా, దక్షిణ గాజాలో దాని వ్యవస్థలను ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. దీనికి కొంత సమయం పట్టవచ్చు’’ అని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ అన్నారు.
ఇతడే డెయిఫ్..
హమాస్ మిలటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ ఫొటోను హగారీ విడుదల చేశారు. గాజా నుంచి స్వాధీనం చేసుకొన్న 7 కోట్ల డిజిటల్ ఫైల్స్ నుంచి దీనిని గుర్తించామని చెప్పారు. ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఇతడు ఉన్నాడు. విడుదల చేసిన ఫొటోలో డెయిఫ్ కప్పు పట్టుకొని కనిపించాడు.
ఎవరీ హమాస్ మాస్టర్మైండ్ డెయిఫ్..!
గాజా ఆపరేషన్లో ఇప్పటి వరకు 176 మంది సైనికులను కోల్పోయినట్లు హగారీ వెల్లడించారు. ఉత్తర గాజా నుంచి రాకెట్ కాల్పులు అప్పుడప్పుడు చోటు చేసుకొంటున్నా.. భారీ దాడులు చేసే సత్తా హమాస్కు లేదని వివరించారు. సెంట్రల్ గాజా ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయిందని చెప్పారు. అక్కడ ఖాన్ యూనిస్ ప్రాంతంలో సొరంగాలతో భూగర్భ నగరమే ఉందన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో ఎటువంటి షార్ట్కట్లు ఉండవని వివరించారు.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్లో బెర్రీ కిబుట్జ్పై దాడికి పాల్పడిన హమాస్ నుస్రెత్ బెటాలియన్ కమాండర్ ఇస్మాయిల్ సిరాజ్, అతడి డిప్యూటీ అహ్మద్ వాహబ్లను తాజాగా సెంట్రల్ గాజాలో మట్టుబెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్బెట్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
-
బహిరంగ క్షమాపణలు కోరిన మెహరీన్.. ఎందుకంటే!
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..