Israel: ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి.. 20 నిమిషాల్లో గాజా నుంచి 5వేల రాకెట్లు..!
ఇజ్రాయెల్ (Israel) లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు.
జెరూసలెం: ఇజ్రాయెల్ (Israel), పాలస్తీనా (Palestina) మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. శనివారం ఉదయం గాజా (Gaza) నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు (Rockets) దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు (Hamas militants) చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది.
వివాదాస్పద గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది.
5వేల రాకెట్ల వర్షం..
ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది.
ఇజ్రాయెల్ ‘ఐరన్ స్వార్డ్స్’..
తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. ‘ఇజ్రాయెల్ సైన్యం ప్రతి చోటా శత్రువులతో పోరాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. భద్రతాపరమైన సూచనలను పాటించండి’ అని మంత్రి తెలిపారు. అటు హమాస్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ‘ఐరన్ స్వార్డ్స్’ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా ఆరోపించింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
హమాస్ అధీనంలో పోలీస్ స్టేషన్..
అటు ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం.
సైనికుల కిడ్నాప్..
సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది.
1967 అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకొన్న ఓ నిర్ణయంపై స్వపక్షం, విపక్షంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇజ్రాయెల్కు అండగా ఉండాలని పలువురు నాయకులు ఆయనను కోరుతున్నారు. -
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
Russia: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును తొలగించారు. -
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
ఒక ప్రదేశానికి వెళ్లే క్రమంలో దారి తప్పే పరిస్థితిని నివారించే మెదడు యంత్రాంగాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అది న్యూరల్ కంపాస్లా పనిచేస్తుందని తెలిపారు. -
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్దీప్ సింగ్ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. -
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ హెచ్చరిక
అణుబాంబు తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ సుప్రీం నేత అల్ ఖమేని సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ తమ దేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడబోదని పేర్కొన్నాడు. -
సంక్షిప్త వార్తలు (6)
ఇండోనేసియాలోని పశ్చిమ జావా ప్రావిన్సులో బ్రేకులు సరిగా పనిచేయక ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 53 మందికి గాయాలయ్యాయని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. -
ఖర్కీవ్పై పట్టుబిగిస్తున్న రష్యా
ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు రష్యా అక్కడి పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఉద్ధృతంగా భూతల దాడులు జరుపుతోంది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, గోధుమపిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. -
శభాష్ ‘ఎవరెస్ట్ మ్యాన్’!
ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారీ ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. -
ఇజ్రాయెల్కు అనూహ్య ప్రతిఘటన
ఈజిప్టు- దక్షిణ గాజా సరిహద్దుల్లోని రఫా నగరంపై దాడి చేస్తే హమాస్ అంతమవుతుందని భావిస్తున్న ఇజ్రాయెల్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. -
జన్యుమార్పిడి పంది కిడ్నీ అమర్చిన వ్యక్తి మృతి
జన్యుమార్పిడి పంది నుంచి సేకరించిన మూత్రపిండాన్ని పొందిన తొలివ్యక్తి రిచర్డ్ ‘రిక్’ స్లేమన్ (62) చనిపోయారు. కొత్త అవయవాన్ని పొందిన అనంతరం అతడు దాదాపు రెండు నెలలు జీవించాడు. -
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి
భారత్ విరాళంగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని నడిపై శక్తిసామర్థ్యాలు తమ దేశ పైలట్లకు లేవని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. -
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
తండ్రికి వచ్చే పింఛన్ తీసుకొంటున్న ఓ మహిళ.. అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్