Japan: న్యూఇయర్ విషాదం: ఒకే రోజు 155 భూకంపాలు.. 24కు చేరిన మృతుల సంఖ్య
జపాన్లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: జపాన్ భూకంపంలో కీలక విషయాలు మెల్లగా వెల్లడవుతున్నాయి. ఒక్క సోమవారమే ఈ దేశంలో తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 3-7.6 మధ్యలో నమోదైంది. మంగళవారం కూడా ఇక్కడ ఆరు సార్లు భూమి కంపించింది. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 13 వరకు ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 24కు చేరిందని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక నీగట, టొయామ, ఫుకూయ్, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు.
భూకంపంతో అసైచి వీధిలో 200 కట్టడాలు దగ్ధం..
పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్లలోనే ఉండటంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్హెచ్కే వెల్లడించింది. ఈ నగరంలోనే ఇప్పటివరకు 14 మరణాలు నమోదయ్యాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారాయి.
- ఇక సుజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి.
- షికా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి.
- హిమి ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్లు ఉంటాయి. తాజాగా వచ్చిన భూకంపంలో ఇవి చాలా వరకు దెబ్బతిన్నాయి.
దక్షిణ కొరియాలో ఘోరం.. ప్రతిపక్ష నేతపై కత్తి దాడి!
జపాన్లో మంగళవారం కూడా భూప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. అసలు ప్రాణనష్టం ఎంతో తెలుసుకోవడం ఇప్పుడు జపాన్ ముందున్న ప్రధాన సమస్య. వేల సంఖ్యలో జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఫైర్ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దారుణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ఎయిర్పోర్టులోని రన్వే భారీ పగుళ్లు ఏర్పడటంతో మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాలంతో పోటీపడుతూ గాలింపు, సహాయక చర్యలు చేస్తున్నామని జపాన్ ప్రధాని కిషిద స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా భూకంప ప్రభావిత నోటో ద్వీపకల్పానికి సహాయక బృందాలు చేరడం ప్రధాన సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు.
తొలి 72 గంటలే ఎందుకు కీలకం..?
సాధారణంగా భూకంపం (Earthquake) నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని యూనివర్శిటీ కాలేజి లండన్కు చెందిన డిజాస్టర్ అండ్ హెల్త్ విభాగ ప్రొఫెసర్ ఇలాన్ కెల్మన్ చెబుతున్నారు. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకొన్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు.. చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. సోమవారం జపాన్లో భూకంపం వచ్చి 24 గంటలు ఇప్పటికే గడిచిపోయాయి. మంగళవారం కూడా ప్రకంపనలు కొనసాగుతుండటంతో కూలిన భవనాల శిథిలాల వద్ద సహాయక చర్యలు చేపట్టడం సవాళ్లతో కూడుకొన్నపని.
మరోవైపు అర్ధంతరంగా నిలిపివేసిన నాలుగు బుల్లెట్ రైళ్ల సేవలను జపాన్ పునరుద్ధరించింది. వీటి కారణంగా దాదాపు 1400 మంది చిక్కుకుపోయారు. ఈ రైళ్లు టొయమా స్టేషన్, కంజావా స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో కారక వైరస్ అవశేషాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. 10లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. -
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్ అవుతోన్న తరుణంలో కమలా హారిస్(Kamala Harris)కు భారీగా మద్దతు లభిస్తోంది. -
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
Kamala Harris: జూమ్ కాల్లో కమలాహారిస్ రికార్డు సృష్టించారు. ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ కోసం చేపట్టిన ఈ కాల్లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. -
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. -
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
Barack And Michelle Obama: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలాహారిస్కు ఒబామా దంపతులు మద్దతు తెలిపారు. -
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కట్టుబడి ఉన్నారని శ్వేతసౌధం ప్రకటించింది. దేశ విదేశాంగ విధానం, జాతీయ భద్రతను అధ్యక్షుడు ముందుకుతీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. -
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
కెనడాలో కార్చిచ్చు తాజాగా సగం జాస్పర్ నగరాన్ని కాల్చి బూడిదగా మార్చేశాయి. దీంతో వేల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. -
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉన్న జేడీ వాన్స్(JD Vance) గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. -
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
ప్రపంచవ్యాప్తంగా హింసాత్మకమైన డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థల్లో ఒకటిగా పేరుపొందిన ‘సినాలోవా కార్టెల్’ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్ -
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
పపువా న్యూగినియాలో దారుణం చోటుచేసుకొంది. 26 మందిని ఓ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. వారి మృతదేహాలను మొసళ్లు నదిలోకి ఈడ్చుకెళ్లాయి. -
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడం కోసం ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. అతడి చర్యల కారణంగా ఏకంగా రూ.2 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. -
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్(Kamala Harris) వెల్లడించారు. -
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
జోబైడెన్ మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉందని శ్వేతసౌధం డాక్టర్లు చెబుతున్నారు. -
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
US-India Defense Cooperation Act: భారత్ను అమెరికా మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందంటూ అగ్రరాజ్య కాంగ్రెస్లో కీలక సెనేటర్ బిల్లు ప్రవేశపెట్టారు. -
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
Harris - Netanyahu: హమాస్తో యుద్ధం ముగింపునకు సమయం వచ్చిందని కమలా హారిస్ అన్నారు. ఆ దిశగా ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు సూచించారు. -
69 రకాల పురుగుమందులతో రైతులకు.. ధూమపానం స్థాయిలో క్యాన్సర్ ముప్పు!
కొన్ని రకాల పురుగుమందుల వినియోగంతో రైతుల్లో క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. -
దేశ భవిష్యత్తు కోసం పోరాడతా
‘అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని నేను భావిస్తున్నా. ఒకటి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే మన విధానం.. రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం.. ఈ రెండింటిలో మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. -
అధికారానికి కమలా హారిస్ అనర్హురాలు
అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు అర్హత లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మోదీ రష్యా పర్యటననిరాశ కలిగించింది
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని అమెరికా తెలిపింది. -
సంక్షిప్త వార్తలు (5)
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను, సరిహద్దుకు సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో గౌరవించాల్సిందేనని చైనాకు భారత్ మరోసారి నొక్కిచెప్పింది. -
బైడెన్, హారిస్తో నెతన్యాహు భేటీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం వాషింగ్టన్లో భేటీ అయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్