Kenya: మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారట : ఆందోళనకారులపై పోలీసుల ఆరోపణ
కెన్యాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల (Kenya Protests) నేపథ్యంలో తమ అధికారులను దోషులుగా చిత్రీకరించేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారని (Hiring Dead bodies) పోలీసు ఆరోపించారు.
నైరోబీ: కెన్యాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు (Kenya Protests).. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని హక్కుల సంఘాలు చెబుతుండగా.. పోలీసులు (Kenya Police) మాత్రం వారి వాదనను వ్యతిరేకిస్తున్నారు. పోలీసు అధికారులను దోషులుగా చిత్రీకరించేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారని (Hiring Dead bodies) ఆరోపించారు.
‘పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకొని వాటిని మీడియా ముందు ఊరేగించారు’ అని కెన్యా జాతీయ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ జఫెట్ కూమే ఆరోపించారు. తమపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో (ICC) కేసులు నమోదు చేస్తామని వస్తోన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేస్తామని స్పష్టం చేశారు. అయితే, మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలను మాత్రం పోలీస్ బాస్ చూపించలేదు.
పురుగులున్న చీకటి గదిలో..ఇమ్రాన్ ఖాన్!
భారీగా పెరిగిన జీవన వ్యయంతో అల్లాడిపోతున్న కెన్యాలో ఇటీవల పన్నులు పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేస్తూ ప్రతిపక్ష కూటమి జులై నెలలో ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేకమంది మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులపై వ్యక్తిగతంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఫిర్యాదు చేస్తామని హక్కుల సంఘాలు వెల్లడించడంపై పోలీసులు స్పందించారు.
ఇదిలాఉంటే, కెన్యాలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 11 మంది చనిపోయినట్లు కెన్యాలోని అమ్నెస్టీ ఇంటర్నేషనల్తోపాటు అక్కడి న్యాయ, వైద్య సంఘాలు వెల్లడించాయి. పోలీసుల నుంచి తప్పించుకుపోవడం లేదా లొంగిపోయే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించారని తెలిపాయి. అటు ఇండిపెండెంట్ మెడికో-లీగల్ యూనిట్ (ఐఎంఎల్యూ) మాత్రం 35మంది చనిపోయారని పేర్కొంది. విపక్ష కూటమి మాత్రం 50మంది వరకు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలోభాగంగా రెండు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. -
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
వైట్ హౌస్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అతిథులకు పానీపూరీ వడ్డించారు. భారత్కు చెందిన ‘సారే జహాసె అచ్ఛా’ గీతాన్ని ఆలపించడం విశేషం. -
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్లో ఆర్థిక సంస్కరణలకు సర్కారు తెరతీసింది. ప్రభుత్వ రంగంలోని కంపెనీలను మొత్తం ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. -
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
వైట్ హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు సంతతి కుర్రాడు సాయివర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నానని విచారణలో చెప్పాడు. -
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ స్మగ్లర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వేల మందిని ఇతడి గ్యాంగ్ ఐరోపా, యూకేలోకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. -
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
India-US: ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్ట్పై భారత్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి