Russia-Ukarine: రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్కు సాయం తగ్గుతోందా?
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు ఆర్థికంగా అండగా నిలబడిన దేశాలు క్రమంగా తగ్గుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.
కీవ్: రష్యా- ఉక్రెయిన్ (Russia-Ukrarine War) యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు దాడులు చేయకుండా స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఉక్రెయిన్కు అన్ని రకాలుగా అండగా నిలబడిన పాశ్చాత్య దేశాలు ప్రస్తుతం అంతగా ఆసక్తి చూడపడం లేదని తాజా అధ్యయనంలో తేలింది. యుద్ధానికి ముందు ఆర్థికంగా అండగా నిలిచిన దేశాలు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నాయని జర్మనీకి చెందిన కెయిల్ ఇన్స్టిట్యూట్ తన పరిశోధనలో గుర్తించింది. ఉక్రెయిన్ మద్దతుదారులు తగ్గిపోయారని, యుద్ధానికి ముందు ఆ దేశానికి రక్షణ రంగంతోపాటు ఆర్థికంగా సాయం చేసిన దేశాలు క్రమంగా తమ మాటను వెనక్కి తీసుకుంటున్నాయని చెప్పింది.
ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. రష్యా దాడి చేసిన మొదట్లో ఆన్లైన్లో విరాళాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్ ఆయుధాలు కొనడానికి ఈ నిధులు ఎంతో అక్కరకొచ్చాయి. యుద్ధం ఎడతెగకుండా సాగడంతో క్రమంగా విరాళాలు తగ్గుతూ వస్తున్నాయి. అగస్టు 2022 నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో ఉక్రెయిన్ పొందిన విదేశీ సాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది అదే మూడు నెలల వ్యవధిలో ఆ దేశం పొందిన సాయం 87శాతం మేర తగ్గింది. యుద్ధం మొదలైన తర్వాత ఓ త్రైమాసికంలో అత్యంత తక్కువ మొత్తంలో సాయం రావడం ఇదే తొలిసారి. దీనికి వివిధ కారణాలు ఉండొచ్చని కెయిల్ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడింది.
ఆత్మహత్యా..? చిత్రహింసలు పెట్టి చంపేశారా..?: అదృశ్యమైన చైనా నేతపై కథనాలు
పాశ్చాత్య దేశాలతో ఉక్రెయిన్ సంబంధాలు కాస్త బలహీన పడటం కూడా నిధుల లేమికి కారణం కావొచ్చని అధ్యయనం పేర్కొంది.. ఉక్రెయిన్ నుంచి రష్యాను తరిమేస్తామంటూ జూన్ 2023లో మొదలుపెట్టిన ఎదురుదాడి నత్తనడకగా సాగుతోంది. ఆక్రమిత స్థలాల నుంచి రష్యన్లను పారదోలడంలో ఉక్రెయిన్ విఫలమైంది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సాయానికి స్వస్తి చెబుతామని ప్రతిపక్ష రిపబ్లికన్లు బాహాటంగానే చెబుతున్నందున అమెరికా సహాయం అనిశ్చితిలో పడింది. ఐరోపా సమాఖ్యలోనూ (ఈయూ) రాజకీయ విభేదాలు తలెత్తడంతో ఉక్రెయిన్కు గతంలో హామీ ఇచ్చిన మేరకు ఆయుధాలను సరఫరా చేయడం లేదు. అంతేకాకుండా వచ్చే నాలుగేళ్లలో ఉక్రెయిన్కు 53 బిలియన్ యూరోల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ఈయూ.. ఆ నిధుల విడుదలలోనూ తాత్సారం చేస్తోంది.
కెయిల్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు - అక్టోబర్ మధ్య కాలంలో ఉక్రెయిన్కు 2.11 బిలియన్ యూరోల ఆర్థిక సాయం లభించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 87శాతం తక్కువ. గతంలో ఉక్రెయిన్కు ఆర్థికంగా మద్దతు తెలిపిన 40 దేశాల్లో.. ప్రస్తుతం కేవలం 20 దేశాలు మాత్రమే తమ సహకారాన్ని కొనసాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సాయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఈయూ ఆర్థిక సాయం కోసం ఉక్రెయిన్ ఎదురు చూస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
-
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
-
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?