Khawaja Asif: భారత్ కీలుబొమ్మగా అఫ్గాన్: పాక్ రక్షణ మంత్రి ఆరోపణలు

ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Pakistan Defence Minister Khawaja Asif) భారత్ లక్ష్యంగా చేసుకొని మరోసారి నోరుపారేసుకున్నారు. అఫ్గానిస్థాన్ భారత్ చేతిలో కీలుబొమ్మగా మారిందంటూ ఆరోపించారు. ఈసందర్భంగా ఇస్లామాబాద్పై దాడి జరిగితే.. దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి తప్పదంటూ హెచ్చరికలు చేశారు.
ఓ వార్తా సంస్థకు సంబంధించిన షోలో ఆయన మాట్లాడుతూ కాబూల్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. కాబూల్లోని ప్రజలను దిల్లీ నియంత్రిస్తోందన్నారు. భారత్ చేతిలో అఫ్గాన్ (Afghanistan) కీలుబొమ్మగా మారిందంటూ ఆరోపణలు చేశారు. భారత్ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశాన్ని ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించారు. కాబూల్తో ఓ ఒప్పందానికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా.. కొందరు జోక్యం వల్ల అది ఉపసంహరణకు గురవుతుందన్నారు. సరిహద్దుల్లో శాంతి కోసం చర్చలకు పిలుపునిచ్చిన అఫ్గాన్ ప్రతినిధి బృందాన్ని ఆయన ప్రశంసించారు. అయితే, భారత ప్రభావంతో దాని పురోగతి దెబ్బతిందని ఆరోపించారు. ఈసందర్భంగా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో అఫ్గాన్ బెదిరింపులపై ఆసిఫ్ స్పందించారు. తమ దేశంలో ఉగ్రవాదానికి ఆ దేశమే కారణమన్నారు. అఫ్గాన్తో చర్చలు విఫలమైతే.. అది ఆ దేశంతో పూర్తి యుద్ధానికి దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు. కాబూల్ను భారత్ ఓ సాధనంగా ఉపయోగించుకుంటుందన్నారు.
పాక్- అఫ్గాన్ శాంతి చర్చలు విఫలం..
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pakistan-Afghanistan) సరిహద్దుల్లో ఇటీవల ఇరుదేశాల మధ్య ఘర్షణలు నెలకొన్న సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తుర్కియేలో ఇరుదేశాల మధ్య పలు దశల్లో చర్చలు జరిగాయి. అయితే, తాజాగా అవి విఫలమయ్యాయి. చర్చల నేపథ్యంలో పలు అంశాలపై ఇరుదేశాల మధ్య అంగీకారం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, సరిహద్దుల్లో దాడులకు కారణమైన ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తాలిబన్ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఇవి విఫలమయ్యాయని వెల్లడించాయి. పాక్ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పాక్- అఫ్గాన్ చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొందంటూ ఇరుదేశాల ప్రభుత్వ మీడియాల్లో పేర్కొన్న కొన్ని గంటల్లో ఇవి విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో పాక్కు తాలిబన్ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు చేసింది. భవిష్యత్తులో తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా.. ఇస్లామాబాద్ లక్ష్యంగా తమ ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని పాక్కు చెందిన ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. - 
                                    
                                        

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
Neal Katyal: ట్రంప్ టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టులో భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ వాదించనున్నారు. - 
                                    
                                        

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
ఇస్లాం ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలోని పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
Indian student visa: కెనడాలో భారత విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. - 
                                    
                                        

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
Subramanyam Vedam: భారత సంతతికి చెందిన వేదం సుబ్రహ్మణ్యంను అమెరికా నుంచి పంపించకుండా అక్కడి న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. - 
                                    
                                        

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
పాక్ సైన్యం డాలర్లు, ఇతర లాభాల కోసం అమ్ముడుపోతుందని పాక్ జేఎస్ఎంఎం గ్రూపు ఛైర్మన్ షఫీ బుర్ఫాత్ ఆరోపించారు. - 
                                    
                                        

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
ఇజ్రాయెల్ పాలనకు మద్దతు ఇవ్వడం ఆపేవరకు అమెరికాకు తాము సహకరించమని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. - 
                                    
                                        

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
షట్డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది. - 
                                    
                                        

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా మతం గురించి చేసిన వ్యాఖ్యలను భారతీయ- అమెరికన్ అయిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. - 
                                    
                                        

అఫ్గాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 20 మంది మృతిచెందారని, 640 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. - 
                                    
                                        

పాక్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోంది
పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎవరికీ చెప్పరు. - 
                                    
                                        

తొలగని అమెరికా ప్రభుత్వ ప్రతిష్టంభన
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫెడరల్ ప్రభుత్వ సేవలు మూతబడి 33 రోజులైంది. దీన్ని ప్రభుత్వ మూత అంటున్నారు. - 
                                    
                                        

ఏకాగ్రతను తిరిగి తెచ్చే మెదడు తరంగాలు
మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ భాగంలో సుడుల్లా తిరిగే ఒక మెదడు ప్రక్రియ ఏకాగ్రతకు సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. చేస్తున్న పని నుంచి ఒక్కోసారి ధ్యాస పక్కకు మళ్లుతుంటుంది. - 
                                    
                                        

నైజీరియాపై సైనిక చర్యకు ప్రణాళిక
పశ్చిమ ఆఫ్రికా దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళికను రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. - 
                                    
                                        

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
భారత్ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అబ్దుల్ గయూమ్ ప్రశంసించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 


