PM Modi: సమోసా కాకస్‌ ఫ్లేవర్ మరింత విస్తరించాలి.. యూఎస్‌ కాంగ్రెస్‌లో మోదీ వ్యాఖ్య

అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. కీలక పదవుల్లో కొనసాగుతున్న ప్రవాస భారతీయులపై ప్రశంసల జల్లు కురిపించారు. 

Published : 23 Jun 2023 17:16 IST

వాషింగ్టన్‌: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రస్తుతం అమెరికా (America) పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అగ్రదేశంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ప్రవాస భారతీయులపై ఆయన ప్రశంసలు కురిపించారు.

‘భారత మూలాలు కలిగిన ఎందరో వ్యక్తులు ప్రస్తుతం అమెరికాలో తమ మార్క్‌ చూపిస్తున్నారు. వారిలో కొందరు చట్టసభల్లో కూడా కూర్చున్నారు’అని ఉపాధ్యక్షురాలు, ఇతర ప్రవాస భారత చట్టసభ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ‘ఈ కాంగ్రెస్‌లో సమోసా కాకస్‌ ఫ్లేవర్ ఉందని నేను విన్నాను. ఇది మరింత విస్తరించాలని ఆశిస్తున్నా. భారత్‌లోని భిన్న రుచులన్నీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను’అని అమెరికాలో భారతీయుల ప్రాధాన్యం పెరగాలన్న ఉద్దేశంతో ఈ చమత్కారం చేశారు.

సమోసా కాకస్‌.. భారత్‌లో ప్రాచుర్యం పొందిన సమోసా వంటకం పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. అమెరికా చట్టసభలకు ఎన్నికైన దక్షిణాసియా మూలాలున్న వ్యక్తులు మరీ ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి ఈ పదాన్ని వాడతారు. రెండు శతాబ్దాలుగా అమెరికన్లు, భారతీయుల జీవితాల నుంచి ఒకరికొకరం స్ఫూర్తి పొందుతున్నామని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని