Deepfake: ‘ఇది భయానక ట్రెండ్‌’: డీప్‌ఫేక్‌లపై సత్యనాదెళ్ల ఆందోళన

డీప్‌ఫేక్‌లపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల(Satya Nadella) ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కట్టడికి త్వరితగతిన స్పందించాలని అన్నారు. 

Updated : 29 Jan 2024 13:19 IST

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో నెట్టింట్లో వెలుగులోకి వస్తోన్న సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ పాప్‌ సింగర్ టేలర్‌స్విఫ్ట్‌(Taylor Swift)కు చెందిన తీవ్ర అభ్యంతరకర డీప్‌ఫేక్‌(Deepfake) దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. ఈ ట్రెండ్‌పై మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.

‘ఈ దుర్వినియోగం భయానకమైనది. దీనిపై వేగంగా స్పందించడం అవసరం అని నేను భావిస్తున్నాను. ఆన్‌లైన్‌లో సురక్షితమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుందని నిర్ధారించేందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలి. డీప్‌ఫేక్‌ల కట్టడికి దర్యాప్తు సంస్థలు, టెక్‌ సంస్థలు కలిసివస్తే.. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా వాటిని అరికట్టవచ్చు’ అని నాదెళ్ల(Satya Nadella) తన అభిప్రాయం వ్యక్తంచేశారు.

మహిళ కిడ్నాప్‌లో ఐరాస ఏజెన్సీ సిబ్బంది.. వివరాలు అందజేసిన ఇజ్రాయెల్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden)ను అనుకరిస్తూ ముందుగానే రికార్డు చేసిన ఫోన్‌ కాల్‌, స్విఫ్ట్‌(Taylor Swift)కు చెందిన అభ్యంతరకర దృశ్యాలపై ఇప్పటికే వైట్‌హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ వెల్లడించారు. దీనిని కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని అన్నారు.  పాప్‌స్టార్‌ చిత్రాలపై  ఎక్స్‌(ట్విటర్) చర్యలు తీసుకుంది. ‘మేం వెంటనే ఆ చిత్రాలను తొలగించాం. వీటిని పోస్టు చేసిన ఖాతాలపై తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఎక్స్‌ వెల్లడించింది. ఈ చర్యల తర్వాత నుంచి ఆమె పేరుతో సెర్చ్‌ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్‌లు దర్శనమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని