Israel: దేశం దాటి వచ్చినా.. ఉలిక్కిపాటే! ఉక్రెయిన్ శరణార్థుల ఆవేదన
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో వేల మంది ఇజ్రాయెల్కు తరలివెళ్లారు. కాగా ప్రస్తుతం అక్కడ కూడా యుద్ధం కొనసాగుతుండటంతో మరోసారి బాంబుల మోత నడుమే జీవనం సాగిస్తున్నారు.
జెరూసలెం: ఉక్రెయిన్పై రష్యా చేసిన దండయాత్ర (Russia Invasion) లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. రష్యా సేనలు-ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరుతో ఉక్రెయిన్లోని అనేక నగరాలు సర్వనాశనమయ్యాయి. బాంబుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు.. తీవ్ర గాయాల నడుమే పొరుగు దేశాలకు తరలిపోయారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి ఇజ్రాయెల్కు శరణుకోరుతూ వచ్చిన వేల మందికి మరో యుద్ధం ముప్పుగా మారింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ల మధ్య కాల్పుల మోత (Israel-Hamas Conflict) మునుపటి చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తున్నాయని ఉక్రెయిన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్ నుంచి వేల మంది..
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఆ సమయంలో దాదాపు 45వేల మంది ఉక్రెయిన్ పౌరులు ఇజ్రాయెల్కు శరణార్థులుగా వచ్చినట్లు అక్కడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇలా ఇజ్రాయెల్కు వచ్చిన వారిలో ఎక్కువగా గాజాకు కొన్ని కి.మీ దూరంలోనే ఉన్న ఆష్కెలాన్ నగరంలో నివసిస్తున్నారు. వారు మునుపటి గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదే సమయంలో హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి వారిలో మరోసారి కలవరం రేపింది. అనంతరం గాజాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న ప్రతిదాడులతో వారుంటున్న ప్రాంతమంతా దద్దరిల్లుతుండటం నిత్యకృత్యంగా మారింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఉక్రెయిన్పై ఎవరూ దృష్టి పెట్టట్లేదు: జెలెన్స్కీ
ఉక్రెయిన్ నుంచి తమకు ఈ భీకర శబ్దాలు మేరియుపోల్ మారణహోమాన్ని గుర్తుచేస్తున్నాయంటూ ఉక్రెయిన్కు చెందిన టట్యానా ప్రిమా అనే 38 ఏళ్ల మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మేరియుపోల్ భీకర దాడిలో తమ కుటుంబం రోడ్డున పడిందని.. తన భర్త చేయి కోల్పోయాడని అన్నారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇజ్రాయెల్కు వచ్చామన్నారు. రష్యా దారుణాల నుంచి కోలుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఇక్కడ మరో ముప్పును చూస్తున్నామన్నారు. తమ బిడ్డలకు సురక్షిత ఆశ్రయం కల్పించలేకపోతున్నామనే భయం తమని వెంటాడుతోందన్నారు. ఈ క్రమంలో కొందరు ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోగా.. మరికొందరు మాత్రం మరోసారి స్థలం మారేందుకు నిరాకరిస్తున్నారని ప్రిమా పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులకు అలవాటుపడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
బాంబులు, సైరన్ల మోత..
గాజాకు అతి సమీపంలో ఉన్న ఆష్కెలాన్ నగర వాసులపై ఇజ్రాయెల్-హమాస్ల యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు రాకెట్లు, బాంబుల శబ్దాలు, మరోవైపు సైరెన్ల మోతతో తీర నగరం మారుమోగుతోంది. ఇప్పటివరకు అనేక రాకెట్లను ఐరన్ డోమ్ నిరోధిస్తున్నప్పటికీ.. సుమారు 80 రాకెట్లు ఆ ప్రాంతంలో పడినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు గుమికూడకుండా స్థానిక అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇలా సంక్షోభం వేళ తమ సన్నిహితులను కలుసుకోవడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులతోపాటు ఉక్రెయిన్వాసులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలోభాగంగా రెండు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. -
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
వైట్ హౌస్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అతిథులకు పానీపూరీ వడ్డించారు. భారత్కు చెందిన ‘సారే జహాసె అచ్ఛా’ గీతాన్ని ఆలపించడం విశేషం. -
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్లో ఆర్థిక సంస్కరణలకు సర్కారు తెరతీసింది. ప్రభుత్వ రంగంలోని కంపెనీలను మొత్తం ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. -
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
వైట్ హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు సంతతి కుర్రాడు సాయివర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నానని విచారణలో చెప్పాడు. -
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ స్మగ్లర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వేల మందిని ఇతడి గ్యాంగ్ ఐరోపా, యూకేలోకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. -
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
India-US: ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్ట్పై భారత్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...