USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
భారత్-అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడే సమయంలో నిజ్జర్ పేరు ప్రస్తావించేందుకు కూడా అమెరికా మంత్రి బ్లింకెన్ ఇష్టపడలేదు. మరోవైపు త్వరలోనే జరగనున్న 2+2 భేటీకి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క: నిజ్జర్ హత్య విషయంలో ఓ పక్క అమెరికా మద్దతు మాకే అని కెనడా (Canada) చెబుతున్నా.. ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు వాషింగ్టన్ ఇష్టపడటంలేదు. తాజాగా భారత (India) విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికా (USA) విదేశంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలపై చర్చించారు. కెనడాతో దౌత్యవివాదం తలెత్తిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ భేటీపై జైశంకర్ ట్వీట్ చేశారు. ‘‘నా మిత్రుడు, అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో భేటీ కావడం సంతోషంగా ఉంది. విస్తృత స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. త్వరలో జరగబోయే 2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించాం’’ అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
మరోవైపు ఈ సమావేశంపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ‘‘జీ20కి భారత్ నేతృత్వంలో లభించిన ఫలితాలు, ఇండియా-మిడిల్ఈస్ట్-యూరోప్ కారిడార్, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై పెట్టబడులు వంటి అంశాలను మాట్లాడుకొన్నారు. భవిష్యత్తులో జరగబోయే 2+2 భేటీ కోసం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ, స్పేస్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో సమన్వయం కొనసాగడం అవసరమని బలంగా విశ్వసిస్తున్నారు’’ అని వెల్లడించారు. ఇరు దేశాల మంత్రుల భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 2+2 భేటీ తేదీలను మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా ఏటా ఈ సమావేశం నవంబర్ తొలి అర్ధ భాగంలో జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఇరు దేశాల విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు పాల్గొంటారు.
నిజ్జర్పై నోరు మెదపని బ్లింకెన్..!
భారత్-అమెరికా విదేశాంగ మంత్రులు.. నిజ్జర్ హ్యవహారంపై గుంభనంగా వ్యవహరించారు. ఈ విషయం చర్చకు వచ్చిందా.. రాలేదా అనే విషయం కూడా వెల్లడించలేదు. దీనిపై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ నిరాకరించారు. ‘‘నా మిత్రుడు, సహచరుడు జైశంకర్ను విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. జీ20, ఐరాస జనరల్ అసెంబ్లీ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయి’’ అని వెల్లడించారు. స్టేట్ డిపార్ట్మెంట్ ట్రీటీ రూమ్లో జరిగిన ఫొటో సెషన్లో ఇరు దేశాల మంత్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. జీ20 సదస్సుకు సహకరించినందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని కెనడా ప్రధాని ట్రూడో ఓ పక్క ప్రకటించారు. కానీ, ఈ భేటీపై ప్రకటన సమయంలో ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
అంతకు మందు జైశంకర్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్తో శ్వేత సౌధంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు జైశంకర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం అమెరికాలోని థింక్ ట్యాంక్ బృందాల సభ్యులతో, అమెరికా ట్రేడ్ ప్రతినిధి కేథరిన్ తాయ్తో భేటీ అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సముద్ర ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా వేగంగా అడుగులు వేస్తున్నాయి. దీనిలోభాగంగా రెండు ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. -
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు
వైట్ హౌస్లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అతిథులకు పానీపూరీ వడ్డించారు. భారత్కు చెందిన ‘సారే జహాసె అచ్ఛా’ గీతాన్ని ఆలపించడం విశేషం. -
పాక్ ప్రభుత్వ కంపెనీలన్నీంటిని ప్రైవేటీకరిస్తాం: ప్రధాని షెహబాజ్
పాకిస్థాన్లో ఆర్థిక సంస్కరణలకు సర్కారు తెరతీసింది. ప్రభుత్వ రంగంలోని కంపెనీలను మొత్తం ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. -
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ప్రజలు పోలీసులపై దాడి చేసి చితకబాదుతున్నారు. -
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
వైట్ హౌస్ (White House) పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు సంతతి కుర్రాడు సాయివర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు. తన లక్ష్యం కోసం అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నానని విచారణలో చెప్పాడు. -
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
అక్రమ వలసలతో ఐరోపాకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఓ స్మగ్లర్ను యూకే పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని వేల మందిని ఇతడి గ్యాంగ్ ఐరోపా, యూకేలోకి తరలించినట్లు ఆరోపణలున్నాయి. -
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
India-US: ఇరాన్తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదని అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్ట్పై భారత్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఐరాస వాహనంపై దాడి.. గాజాలో భారతీయుడి మృతి
Indian killed in Gaza: గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతిచెందాడు. ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. -
మాల్దీవులకు భారత్ మళ్లీ సాయం
మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చింది. -
వనమూలికతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్
ఒక వన్యప్రాణి తన శరీరంపైనున్న గాయాలకు ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. -
ఉత్తర కొరియాలో ఎరుపురంగు లిప్స్టిక్పై నిషేధం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. -
గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలగిన మెలిందా
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్’ కో-ఛైర్ పదవికి మెలిందా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా చేశారు. -
పీవోకేకు రూ.2,300 కోట్లు విడుదలకు షెహబాజ్ హమీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలకు పాకిస్థాన్ భయపడింది. గత కొన్ని రోజులుగా అధిక ధరలకు, పెరిగిన విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా పీవోకేలోని ముజఫరాబాద్, మీర్పూర్ ప్రాంతాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. -
వాళ్లో.. మేమో.. తేల్చుకుంటాం.. వెనక్కి తగ్గేదే లేదు
హమాస్ మిలిటెంట్లను రాక్షసులుగా అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. సోమవారం ఆయన హమాస్ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
రష్యాలో భవనం కూలిన ఘటనలో 13కు పెరిగిన మృతుల సంఖ్య
రష్యాలోని సరిహద్దు నగరం బెల్గొరోడ్లో పదంతస్తుల ఓ నివాస భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. -
నేపాల్ అధ్యక్షుడి సలహాదారు రాజీనామా
నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆర్థిక సలహాదారు చిరంజీవి నేపాల్ తన పదవికి రాజీనామా చేశారు. దానికి అధ్యక్షుడు ఆదివారం ఆమోదం తెలిపారు. -
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
ఒక్క అణు బాంబు పేలుడు చూసే బతకడం కష్టం.. అలాంటిది జపాన్కు చెందిన ఓ వ్యక్తి మానవ చరిత్రలో చోటు చేసుకొన్న రెండు అణుబాంబుల పేలుళ్లను స్వయంగా చూసి మృత్యువు నుంచి త్రుటిలో బయటపడ్డాడు. -
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
North Korea Bans Red Lipstick: ఉత్తర కొరియాలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం విధించారు. ఎందుకు? ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ