AP News: మహిళలకు జగన్‌ చేయూత.. ఉత్తుత్తే

‘చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తాం’ నవరత్నాల కింద జగన్‌ ఇచ్చిన హామీ ఇది. నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తామని చెప్పి..చివరి విడతను మాత్రం గాలికొదిలేశారు.

Published : 29 Apr 2024 10:04 IST

‘చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తాం’ నవరత్నాల కింద జగన్‌ ఇచ్చిన హామీ ఇది. నాలుగు విడతల్లో రూ.75 వేలు అందిస్తామని చెప్పి..చివరి విడతను మాత్రం గాలికొదిలేశారు. ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున 27 లక్షల మందికి మొండిచెయ్యి చూపించారు. మొత్తం రూ.5,060 కోట్లు ఎగ్గొట్టారు. మొదటి మూడు విడతలనైనా తిన్నగా అమలు చేశారా అంటే అదీ లేదు. నిబంధనల కొర్రీలు వేసి ఎక్కడికక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. ఇక ఆ పథకం కింద మహిళలకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా జీవనోపాధి కల్పిస్తున్నామని నాలుగేళ్లపాటు ఊదరగొట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు