DL RavindraReddy: ఆ నలుగురు ఐఏఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేయాలి: మాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి

పింఛన్‌దారులను ఇబ్బందులకు గురి చేసిన ఐఏఎస్‌ అధికారులు జవహర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శశిభూషణ్‌ కుమార్‌, ధనుంజయ్‌రెడ్డిలపై మాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పేదలపై కనికరం లేదని ఆరోపించారు.

Published : 02 May 2024 16:58 IST

పింఛన్‌దారులను ఇబ్బందులకు గురి చేసిన ఐఏఎస్‌ అధికారులు జవహర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, శశిభూషణ్‌ కుమార్‌, ధనుంజయ్‌రెడ్డిలపై మాజీ మంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పేదలపై కనికరం లేదని ఆరోపించారు. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్‌యకోసం వెళ్లిన వృద్ధులను బ్యాంకు సిబ్బంది పురుగులను చూసినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. పింఛన్‌ సొమ్మును పాత బకాయి కింద జమ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నలుగురు అధికారులను జైల్లో పెట్టి.. ప్రాసిక్యూషన్‌ చేయాలని డిమాండు చేశారు. 

Tags :

మరిన్ని