WestBengal: సందేశ్‌ఖాలీపై టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం

సార్వత్రిక ఎన్నికల వేళ సందేశ్ ఖాలీ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది.

Published : 28 Apr 2024 15:02 IST

సార్వత్రిక ఎన్నికల వేళ సందేశ్ ఖాలీ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. సందేశ్ ఖాలీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సీబీఐ భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. సందేశ్ ఖాలీలో ఉగ్రవాదులకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) రక్షణగా నిలుస్తోందని భాజపా (BJP) విమర్శల దాడి పెంచగా.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సీబీఐ సందేశ్ ఖాలీలో తనిఖీలు చేయడంపై టీఎంసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Tags :

మరిన్ని