బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 23:02 IST

దిల్లీకి షాక్‌.. కోల్‌కతా ఘన విజయం

కోల్‌కతా: హ్యాట్రిక్‌పై కన్నేసిన దిల్లీకి కోల్‌కతా షాక్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఫిలిప్‌ సాల్ట్‌ (68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (33*), వెంకటేశ్‌ అయ్యర్‌ (26*) రాణించారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 2, విలియమ్స్‌ 1 వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్ (35) టాప్‌ స్కోరర్‌. పంత్‌ (27) మినహా మిగతావారు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, వైభవ్‌ అరోరా 2, హర్షిత్‌ రాణా, స్టార్క్‌ 1, నరైన్‌ 1 వికెట్‌ తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని