SEBI Jobs: సెబీలో ఉద్యోగాలు.. నెలకు ₹లక్షన్నర వేతనం!
సెబీలో భారీ వేతనాలతో పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది.
Jobs In SEBI| ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగులకు గుడ్న్యూస్. దేశంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో మొత్తం 97 ఆఫీసర్ గ్రేడ్ ఎ (అసిస్టెంట్ మేనేజర్) ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. జనరల్, లీగల్, ఐటీ, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్, రీసెర్చ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏప్రిల్ 13 నుంచి ఆన్లైన్ https://www.sebi.gov.in/ లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ దివ్యాంగులకు ఉచితంగానే శిక్షణ ఇస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.
- మొత్తం 97 ఉద్యోగాలకు గాను.. జనరల్ విభాగంలో 62, ఐటీలో 24, లీగల్ విభాగంలో 5, ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీల్లో చెరో రెండు చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు.
- అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్/పీజీ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలను ఈ కింది పీడీఎఫ్లో చూడొచ్చు.
- దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.1000 + జీఎస్టీ (నాన్ రిఫండబుల్) చెల్లించాలి. అదే, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే రూ.100+ జీఎస్టీ చెల్లిస్తే చాలు.
- వయో పరిమితి: 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ: మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలి దశలో రెండు పేపర్లకు ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన వారిని రెండో దశ పరీక్ష (ఆన్లైన్)కు షార్ట్లిస్ట్ చేస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూలు దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తారు.
- ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది.
- వేతనం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతం, ఇతర సౌకర్యాలతో కలిపి నెలకు దాదాపు రూ.1,49,500 (అకామిడేషన్ లేకుండా); అకామిడేషన్తో అయితే నెలకు రూ.₹1,11,000 చొప్పున అందుతుంది.
- ఉచితంగా ఆన్లైన్ కోచింగ్: ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(ఎన్సీఎల్/దివ్యాంగులకు సెబీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏర్పాటుచేస్తుంది. ఉచితంగానే ఆన్లైన్లో ఈ శిక్షణ ఇస్తారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమయంలోనే సంబంధిత కాలమ్లో ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే