Apply Now: ఇంటర్ అర్హతపై 1,207 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులకు గడువు ఆగస్టు 23తో ముగియనుంది. మొత్తం 1207 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.
దిల్లీ : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనో గ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ ), స్టెనో గ్రాఫర్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆగస్టు 23తో దరఖాస్తుల గడువు ముగుస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్లో ముఖ్యాంశాలివే..
- మొత్తం ఉద్యోగాలు 1207 కాగా.. వాటిలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 93, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి 1114 పోస్టులు ఉన్నాయి.
- అర్హతలు: అభ్యర్థులు కచ్చితంగా 12వ తరగతి పాసై ఉండాలి.
- వయోపరిమితి: స్టెనోగ్రాఫర్ సి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి 18-33, స్టెనోగ్రాఫర్ డి 18-27 ఏళ్లు ఉండాలి. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు.
- దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)
- దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 24, 25 తేదీల వరకు గడువిచ్చారు.
- అక్టోబరులో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ (https://ssc.nic.in)లో చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మెదడులో నాడీ దిక్సూచి.. గుర్తించిన శాస్త్రవేత్తలు
-
ఓటు కోసం ద్విచక్రవాహనంపై దంపతుల సాహస యాత్ర!
-
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
-
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
-
రూ.4 వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్
-
భారత్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్లను నడిపే సామర్థ్యం మా పైలట్లకు లేదు: మాల్దీవుల మంత్రి