నోటీస్బోర్డు
బెల్, బెంగళూరులో టీచింగ్ పోస్టులు
ప్రభుత్వ ఉద్యోగాలు
బెల్, బెంగళూరులో టీచింగ్ పోస్టులు
బెంగళూరు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్- తాత్కాలిక ప్రాతిపదికన 30 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీచింగ్ పోస్టులు: ఎన్టీటీ, పీఆర్టీ, జీపిటీ, టీజిటీ, పీజీటీ, పీయూసీ, ఎఫ్జీసీ, ఆఫీస్ అసిస్టెంట్ ఇతరాలు. సబ్జెక్టులు: ఇంగ్లిష్, కన్నడ, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ మొదలైనవి. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పీహెచ్డీ. దరఖాస్తులు: పోస్ట్ ద్వారా పంపాలి. చిరునామా: సెక్రటరీ, బీఈ, బెల్ హైస్కూల్ బిల్డింగ్, జలహల్లి, పీఓ బెంగళూరు. దరఖాస్తుకు చివరి తేదీ: 23-04-2024
వెబ్సైట్:https://bel-india.in/job-notifications/
ప్రవేశాలు
ఐఐఎంలో ఆన్లైన్ ఎంబీఏ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్.. రెండేళ్ల వ్యవధి ఉండే ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్లో ప్రవేశాలు కోరుతోంది.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం.
ఎంపిక: ఆన్లైన్ ఐఐఎంఏ అడ్మిషన్ టెస్ట్ (ఐటీఏ), క్యాట్, జీమ్యాట్/ జీఆర్ఈ స్కోరు, షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024. ఐటీఏ అడ్మిట్ కార్డ్: 14-05-2024. పరీక్ష తేదీలు: మే 19, 26. షార్ట్లిస్ట్: మే 29 ఇంటర్వ్యూ: జూన్ 1, 2, 8, 9 తుది ఎంపిక: జూన్ 12
వెబ్సైట్https://www.iima.ac.in/
హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్
హైదరాబాదులోని డెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ. దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1,500. ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు రూ.1,000 డీడీ ద్వారా చెల్లించాలి.
చిరునామా: అడ్మిషన్ సెల్ దార్-ఉస్-సలామ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, దార్-ఉస్-సలామ్, అగాపురా, నాంపల్లి, హైదరాబాదు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 30-05-2024.
- రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీ: జూన్ 10
- ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఉచిత శిక్షణ తరగతులు: జూన్ 25 - 29.
- ప్రవేశ పరీక్ష తేదీ: 30-06-2024.
- పరీక్ష ఫలితాలు: జులై 10న.
వెబ్సైట్: http://www.dshm.co.in/
అప్రెంటిస్షిప్
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్పుర్లో...
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2024-25 సంవత్సరానికి నాగ్పుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్షాప్ (నాగ్పుర్)లో అప్రెంటిస్షిప్ శిక్షణలో భాగంగా 861 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు.
అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: (10-04-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.
వెబ్సైట్:https://secr.indianrailways.gov.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం