ICAI CA Exams: సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల షెడ్యూల్లో మార్పు
ప్రతిష్ఠాత్మక సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. తాజా షెడ్యూల్ ఇదే..
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సీఏ ఇంటర్, గ్రూప్ 1 పరీక్ష మే 3, 5, 9 తేదీల్లో; గ్రూప్ 2 పరీక్ష మే 11, 15, 17 తేదీల్లో జరగనున్నాయి.
సెబీలో ఉద్యోగాలు.. నెలకు ₹లక్షన్నర వేతనం!
సీఏ ఫైనల్, గ్రూప్ 1 పరీక్షను మే 2, 4, 8 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్ష మే 10, 14, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐసీఏఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. తాజా షెడ్యూల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. మెంబర్స్ ఎగ్జామినేషన్.. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్-అసెస్మెంట్ పరీక్షను మే 14, 16 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్ https://www.icai.org/ లో చెక్ చేసుకోవాలని సూచించింది.
మరోవైపు ప్రతిష్ఠాత్మక ఛార్టెర్డ్ అకౌంటెంట్(సీఏ) పరీక్షలను ఇకపై మూడుసార్లు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐసీఏఐ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు ఏడాదికి మే/జూన్లో ఒకసారి, నవంబర్/డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తూ వస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలను మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి