JEE Main 2024 (Session 2) Result: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్

జేఈఈ మెయిన్‌ సెషన్‌ (2) పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 

Updated : 25 Apr 2024 02:14 IST

JEE Main 2024 Results | దిల్లీ: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు వచ్చేశాయ్.. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉండటం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్‌ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు. 

స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి

సెషన్ -1లో  23 మందికే 100 పర్సంటైల్!

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీక్షకు 12,21,624 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 4 నుంచి 12వరకు జరిగిన JEE Main సెషన్‌ -2 పరీక్షకు 12.57లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ (NTA) మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్ వివరాలను ప్రకటించింది.

ఇంటర్‌ మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? ఒక్క క్లిక్‌తో ఇలా!

100 పర్సంటైల్‌ సాధించిన తెలంగాణ విద్యార్థులు..

1. హందేకర్‌ విదిత్‌
2. ముత్తవరపు అనూప్‌
3. వెంకట సాయి తేజ మదినేని
4. రెడ్డి అనిల్‌
5. రోహన్‌ సాయి బాబా
6. శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి
7. కేసం చన్న బసవ రెడ్డి
8. మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి
9. రిషి శేఖర్‌ శుక్లా
10. తవ్వ దినేశ్‌ రెడ్డి
11. గంగ శ్రేయాస్‌
12. పొలిశెట్టి రితిష్‌ బాలాజీ
13. తమటం జయదేవ్‌ రెడ్డి
14. మావూరు జస్విత్‌
15. దొరిసాల శ్రీనివాస రెడ్డి

100 పర్సంటైల్‌ సాధించిన ఏపీ విద్యార్థులు..

1. చింటు సతీష్‌ కుమార్‌
2. షేక్‌ సురజ్‌
3. మకినేని జిష్ణు సాయి
4. తోటంశెట్టి నిఖిలేష్‌
5. అన్నరెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి
6. తోట సాయి కార్తీక్‌
7. మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి

27 నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’కు దరఖాస్తులు

జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు వీలు కలగనుంది. JEE Advanced పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు ఐఐటీ మద్రాస్‌ దరఖాస్తులు స్వీకరించనుంది. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ -1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ -2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని