Railway Jobs: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రైల్వే శాఖలో 9,144 ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ
రైల్వే శాఖలో భారీగా టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Railway Jobs Recruitment | దిల్లీ: నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు (ALP Job Recruitment) దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,144 రైల్వే టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 21 ఆర్ఆర్బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 9 నుంచి 18 వరకు సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలు ఇవే..
- పోస్టుల వివరాలు: మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 1092 పోస్టులు కాగా.. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 8,052
- వయో పరిమితి: జులై 1,2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు. గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఎక్స్సర్వీస్మెన్/దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు.
- దరఖాస్తు రుసుం రూ.500. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత రూ.400 రిఫండ్ చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్సర్వీస్మెన్/మహిళలు/థర్డ్జెండర్/మైనార్టీలు/ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
- ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- వేతనం: టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు ఏడో సీపీసీలో లెవెల్ -5 కింద ప్రారంభ వేతనంగా రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులకు లెవెల్ -2 కింద ₹19,990 చొప్పున చెల్లిస్తారు.
- టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వయో పరిమితి, జోన్ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ తదితర పూర్తి వివరాలు ఈ కింది నోటిఫికేషన్లో చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM