పప్పీ కోసం షో త్యాగం
టికెట్లన్నీ అమ్ముడయ్యాయి... వేదిక సిద్ధమైంది... కుర్రకారు కోలాహలం మొదలైంది... ఇంతలో వూహించని వార్త. వేలమందిని సంగీతం సంద్రంలో ఉర్రూతలూగించాల్సిన సింగర్ నేను ......
పప్పీ కోసం షో త్యాగం
టికెట్లన్నీ అమ్ముడయ్యాయి... వేదిక సిద్ధమైంది... కుర్రకారు కోలాహలం మొదలైంది... ఇంతలో వూహించని వార్త. వేలమందిని సంగీతం సంద్రంలో ఉర్రూతలూగించాల్సిన సింగర్ నేను రావట్లోదోచ్ అంది. నిర్వాహకులు బిత్తరపోయారు. పాటగత్తెకు ఏమైందోనని కంగారు పడిపోయారు. ‘నా పప్పీకి ఆరోగ్యం బాగా లేదు. అందుకే నేను లైవ్ షో చేయట్లేదు’ అని తాపీగా సమాధానం చెప్పింది జాస్ స్టోన్. జాస్ స్టోన్అంటే పాశ్చాత్య ప్రపంచంలో తెలియని వారుండరు. తను స్టార్ సింగర్, నటి. టికెట్ ఖరీదు ఎంత ఉన్నా తన లైవ్ షోలకు జనం ఎగబడతారు. జాస్ గతవారం బార్బడోస్, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఒక ప్రదర్శన చేయాల్సి ఉంది. అంతా సిద్ధమయ్యాక ‘నా ప్రియనేస్తం మిస్సీ తీవ్ర అనారోగ్యంగా ఉంది. అందుకే నేను ఈ షో చేయలేకపోతున్నాను. కొద్దిరోజులయ్యాక మళ్లీ మీ ముందుకొస్తా. మిస్సీ ఆరోగ్యం బాగుపడాలని మీరూ ప్రార్థించండి’ అంటూ జాస్ తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది. మడోనా, బ్రిట్నీ స్పియర్స్, లేడీ గాగా లాంటి పాప్సింగర్లు సైతం ఇలా షోల నుంచి అర్థాంతరంగా నిష్క్రమించిన సందర్భాలు అరుదు. ఇంత సిల్లీ కారణంతో ప్రదర్శన ఆపడం ఇంతవరకు జరగలేదు. మరోవైపు స్టోన్ గొప్ప సింగరే కాదు... మంచి మనసున్న వ్యక్తి అని జంతు ప్రేమికులు తనని ఆకాశానికెత్తేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు