Andhra news: ఏపీలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ.. సీఎం సూచనలపై మంత్రుల కమిటీ చర్చ

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 30 Oct 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. పునర్‌వ్యవస్థీకరణపై నియమించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. సమావేశానికి మంత్రులు నారాయణ, అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. నిన్న సీఎం చంద్రబాబుతో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది.

కొత్త జిల్లాల ఏర్పాటు సహా కొన్ని జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం పలు సూచనలు చేశారు. సీఎం చేసిన సూచనల అమలుపై అధికారులతో మంత్రులు చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై చర్చించినట్లు మంత్రులు తెలిపారు. జిల్లాల విభజన వల్ల ఉన్న ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హామీనిచ్చారని, దాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారని, వాటిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. మరోసారి సమావేశమై తుది నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తామన్నారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని