‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
ఈనాడు, అమరావతి: వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. ఛైర్మన్ ఎన్.అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు బూర్ల రామాంజనేయులు, యార్లగడ్డ వెంకట్రావు, తెనాలి శ్రావణ్కుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఆస్తులను జప్తు చేశామంటే సరిపోతుందా..?
‘పెద్దమొత్తంలో అప్పులిచ్చారు. శీతల గిడ్డంగులకూ రుణాలిచ్చారు. వాటిని తిరిగి రాబట్టరా?’ అని సభ్యులు ప్రశ్నించగా.. తిరిగి చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ‘జప్తు చేస్తే సరిపోతుందా? నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులిచ్చి వాటిని వేలం వేసి, మొత్తాన్ని రాబట్టాలి కదా’ అని సభాసంఘం నిలదీసింది. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారిని అప్పటికప్పుడు సభ్యులుగా చేర్చుకుని వారికి పెద్ద మొత్తాల్లో రుణాలిచ్చారు? ఎవరు చెబితే ఇలా చేశారు? ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి’ అని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే దాదాపు రూ.3 కోట్లపైనే అక్రమాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేక పోయారు?’ అని బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు.
గోదాములన్నీ ఒకరికేనా?
‘రైతుల కోసం ఉద్దేశించిన గోదాముల్లో అత్యధికం జగనన్న కాలనీల్లోనే కట్టారు. గోదాములను రాష్ట్రవ్యాప్తంగా కట్టేందుకు ఒకరికే కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటి? వాటికి అనుసంధాన రహదారులు లేవు. ఉపయోగించుకునే స్థితిలో లేవు. ఎవరి ప్రయోజనాల కోసం వాటిని కట్టారు?’ అని సభ్యులు అసహనం వ్యక్తంచేశారు. గోదాముల పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు.
51 సెక్షన్ విచారణ ఏమైంది?
‘సహకార చట్టం 51 సెక్షన్ కింద విచారణను ఫిర్యాదులు వచ్చిన చోటే.. అందులోనూ రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలోనే చేస్తున్నారు. దీనినీ పూర్తిస్థాయిలో చేపట్టక పోవడానికి కారణాలేంటి? విచారణను దారి తప్పించారు. ప్రాథమిక సహకారం సంఘం నుంచి రుణాలు ఇచ్చినప్పుడు కార్యదర్శి ఒక్కరితోనే అయిపోదు కదా? అక్కడ ఉండే త్రిసభ్య కమిటీ ఆమోదమూ కావాలి కదా? రుణాల పంపిణీలో అవకతవకలకు కార్యదర్శులను బాధ్యులను చేసి, త్రిసభ్య కమిటీలోని వారిని ఎలా తప్పిస్తారు? బినామీ పాస్ పుస్తకాలకు సూత్రధారులెవరు? తర్వాత వాటిని ఎలా డిలీట్ చేశారు? బాధ్యులెవరో తేలాలి కదా’ అని అధికారులను రామాంజనేయులు, శ్రావణ్కుమార్ తదితరులు నిలదీశారు. ‘రికార్డులను డిజిటలైజ్ చేయడం అవసరమే. కానీ, అందుకోసం 5జీ కాలంలో 2జీ పరికరాలను ఎందుకు కొన్నట్లు? డిజిటలైజేషన్ ప్రక్రియలోనే అక్రమాలున్నట్లున్నాయి. వీటి సంగతి తేల్చాల్సి ఉంది’ అని సభ్యులు అభిప్రాయపడ్డారు.
15 రోజుల్లోగా సమర్పించండి
‘టర్నోవర్ ఆధారంగా సహకార సంఘాలను తనిఖీ చేసినప్పుడు నాబార్డు/డీసీసీబీలు/ఆడిటింగ్ సంస్థలు గుర్తించిన అవకతవకలపై ఏయే సమాధానాలిచ్చారు? ఆ నివేదికలను 15 రోజుల్లోగా సభా సంఘం ముందుంచండి’ అని ఛైర్మన్ అమరనాథరెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తామని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. - 
                                    
                                        

నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో జారీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. - 
                                    
                                        

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎయిమ్స్లో చికిత్స
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య చికిత్స అందించారు. - 
                                    
                                        

మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. - 
                                    
                                        

అమరావతిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. - 
                                    
                                        

విజయవాడలో ఎల్ఐసీ హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం
వ్యక్తిగత గృహ రుణాల మంజూరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆశించిన ప్రగతి కనబరుస్తోందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందని ఆ సంస్థ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఓఎంసీ గనుల్లో డ్రోన్ సర్వే ప్రారంభం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. - 
                                    
                                        

‘వీధి కుక్కలకు ఆహారం’పై త్వరలో మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీధి శునకాలకు ఉద్యోగులు ఆహారం పెట్టే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. - 
                                    
                                        

భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. - 
                                    
                                        

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్తు సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ను రాష్ట్రానికి ఆహ్వానించారు. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

హాయ్ల్యాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది?
‘ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్కు తరలించాలనే నిర్ణయం ఎవరిది? ఏపీపీఎస్సీ సమష్టిగా నిర్ణయం తీసుకుందా? లేదా అప్పటి ఛైర్మన్, లేదా కార్యదర్శి నిర్ణయం మేరకు వాటిని తరలించారా? ఇందుకు సంబంధించిన ఏమైనా ఉత్తర్వులున్నాయా? - 
                                    
                                        

రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. - 
                                    
                                        

పింఛనుదారులకు డిజిటల్ సాధికారత
పింఛనుదారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛను, పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. - 
                                    
                                        

భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి
‘కార్తిక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగినందున భక్తుల భద్రత, సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతలపై తగిన చర్యలు చేపట్టాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. - 
                                    
                                        

ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

దొనకొండలో ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ రూ.4,260 కోట్లతో నిర్మాణం
ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్ డాలర్ల) వ్యయంతో ‘చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్’ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. - 
                                    
                                        

రాష్ట్రంలో ‘హిందుజా’ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
హిందుజా గ్రూపు రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


