ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

శ్రీచరణి తల్లిదండ్రులు

శ్రీచరణి తండ్రికి మిఠాయి తినిపిస్తున్న చిన్నారి. చిత్రంలో తల్లి రేణుక తదితరులు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లలోని తమ నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వారు మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక మాట్లాడుతూ.. మొదట మా అమ్మాయి అథ్లెటిక్స్‌లో రాణించిందని, తర్వాత ఆమె మామయ్య కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్‌లోకి ప్రవేశించి రాణిస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు