ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. జీడిపప్పునకు పేరుగాంచిన బాపట్ల జిల్లా వేటపాలెంలో ఈ తరహా దండలను తయారుచేస్తున్నారు. ఇందుకోసం జీడిపప్పు గుండ్లు మాత్రమే వినియోగిస్తారు. వీటిని చాలా ఓర్పుతో పూలు కట్టినట్లు కడతారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గుండు చిట్లిపోయి దండకు పనికిరాకుండా పోతుంది. నాలుగు కిలోల నుంచి పది కిలోల వరకు ఇలా కడతారు. ప్రస్తుతం జీడిపప్పు బొకేలు కూడా వచ్చాయి. ఖర్చుతో కూడుకున్నా చూపరులను ఆకర్షించేలా ఉంటాయి.

న్యూస్‌టుడే, వేటపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు