తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వైకాపా నాయకుడు ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎమ్మెల్సీ గ్రీష్మ హెచ్చరిక

ఈనాడు, అమరావతి: వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉన్నత కుటుంబంలో పుట్టి పేదల కోసం పనిచేస్తున్న నారా భువనేశ్వరిపై ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. మహిళలను అవమానించడం, కించపరిచేలా మాట్లాడడమే వైకాపా నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్‌ వెంటనే ప్రసన్నకుమార్‌రెడ్డిని వైకాపా నుంచి సస్పెండ్‌ చేయాలని, భువనేశ్వరికి ప్రసన్నకుమార్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై వైకాపా నాయకుల ప్రవర్తన ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావన్నారు. ఎంతో నిష్ఠతో భవానీ దీక్ష చేస్తున్నా.. కానీ రాజకీయ అభిప్రాయాలు చెప్పేందుకు ప్రెస్‌మీట్‌ పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. తెదేపా నాయకులు సిద్ధాంతంతో పనిచేస్తారని, ప్రతి మహిళనూ గౌరవిస్తారని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు